PRINT TIME: February 23, 2026 11:30 PM
రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు.
రెండో విడత పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు.
December 13, 2025 06:33 PM
96 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
స్థానికం ప్రతినిధి రామన్నపేట కొండ మల్లేశం గౌడ్
నేడు జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో అధికారులు ఏర్పాటు చేశారు. మండలంలో ఉన్న 8 రూట్ల పరిధిలోని 23 గ్రామ పంచాయతీలలో మొత్తం 203 పోలింగ్ స్టేషన్లకు కట్టుదిట్టమైన బందోబస్త్ మధ్య ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు 200 మంది సివిల్ పోలీసులు, 100 మంది ఆర్మ్డ్ పోలీసు సిబ్బందిని నియమించారు. ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ శాంతియుతంగా పోలింగ్ జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ డీసీపీ సీహెచ్ లక్ష్మీనారాయణ, చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, రామన్నపేట ఎస్సై డి. నాగరాజు పాల్గొని భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి