రేణుక ఎల్లమ్మ కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
రేణుక ఎల్లమ్మ కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
రేణుక ఎల్లమ్మ కాంక్రీట్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంక్రీట్ మిల్లర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా కందడి రఘుపతి రెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడిగా కందడి మల్లారెడ్డి ఎన్నికయ్యారు.అలాగే ఉపాధ్యక్షుడిగా సోలుపురం మోహన్ రెడ్డి,ప్రధాన కార్యదర్శులుగా దాసరి కృష్ణ, పొట్ట వెంకటేష్,కోశాధికారిగా జోగు మహేష్ ఎంపికయ్యారు. అసోసియేషన్కు మార్గదర్శకులుగా సలహాదారులుగా బొరేలా జయరాం,ఎరుపుల రాజు కుమార్ నియమితులయ్యారు.ఇక కమిటీ సభ్యులుగా చద్రవెల్లి నాగులు,బుంగపట్ల మధు,పర్రె వెంకటేష్, కందడి శ్రీనివాస్ రెడ్డి,బోర్రెల లక్ష్మణ్ తదితరులు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ,కాంక్రీట్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేస్తామని,పరిశ్రమ అభివృద్ధి కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. సభ్యుల హక్కుల పరిరక్షణతో పాటు,సంఘ గౌరవాన్ని పెంచే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి