రాచకొండ పర్యాటక ఉత్సవాలు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
రాచకొండ పర్యాటక ఉత్సవాలు, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
Kathula narsimha
ముఖ్య అతిథులుగా పాల్గొననున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మి
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని రాచకొండ పర్యాటక ఉత్సవాలను మరియు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడానికి నేడు నారాయణపురం కి రానున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లక్ష్మి సాయంత్రం నాలుగు గంటలకి హాజరుకానున్నారు ఈ సంవత్సరం రాచకొండ చారిత్రక పర్యావరణ,పర్యాటక,పరిరక్షణ రాజప్ప సమితి నిర్వహించే ఉత్సవాలలో రాచకొండ లోని శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి, శ్రీ స్వయంభు వీరభద్ర స్వామి, శ్రీ స్వయంభు జలాభిషేక రుద్ర స్వామి,ట్రి కుటాలయాలు, రాచకొండ లోని దక్షిణ నైరుతి, పడమర మూడు దిశల రాచకొండ త్రివేణిసంగమంగా ప్రవహించే అహల్య నది జలాలతో దేవతామూర్తులకు అభిషేకములు నిర్వహించబడును ఈ పవిత్ర నది తీరాన గల దివ్యమూర్తులను దర్శించి వారి కృపకు పాత్రులు కాగలరని రాచకొండ పర్యాటక ఉత్సవాలు మరియు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయగలరని పర్యాటక ఉత్సవాలు మహాశివరాత్రి ఉత్సవాల కమిటీ రాచకొండ రాజప్ప సమితి ప్రధాన కార్యదర్శి సూరపల్లి వెంకటేశం తెలియజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి