Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:53 AM

రైతు–కార్మికుల హక్కులు మా హక్కులు! – నల్లగొండలో జెండా ఎగురేసిన నిరసన స్వరం

రైతు–కార్మికుల హక్కులు మా హక్కులు! – నల్లగొండలో జెండా ఎగురేసిన నిరసన స్వరం

రైతు–కార్మికుల హక్కులు మా హక్కులు! – నల్లగొండలో జెండా ఎగురేసిన నిరసన స్వరం
26-12-2025 225 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ, స్థానికం:

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం నల్లగొండలోని సుభాష్‌ విగ్రహం వద్ద సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్లజెండాలతో ఘోర నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ — “బీజేపీ ప్రభుత్వం రైతాంగం నల్ల చట్టాలను వ్యతిరేకంగా పోరాడిన సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా మోసం చేస్తోంది. కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరణ హామీలను తుంగలో తొక్కి, కార్పొరేట్ ప్రయోజనాల దిశగా అడుగులు వేస్తోంది” అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
అలా “స్వాతంత్ర్యం ముందు కార్మికులు పోరాడి సాధించిన హక్కులను రద్దు చేసి, నాలుగు కొత్త లేబర్ కోడ్స్ పేరుతో కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది. వీటిని వెంటనే రద్దు చేయాలి” అని డిమాండ్ చేశారు.
తదుపరి వారు కొనసాగిస్తూ — “వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం విబిజీ రాంజీ చట్టంగా మార్చి రాష్ట్రాలకు నిధులు తగ్గించింది. దీంతో పథకం నిర్వీర్యమై గ్రామీణ కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడింది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కులను దెబ్బతీస్తుంది. ఈ ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే, జనవరి 19 వరకు గ్రామ గ్రామాన చైతన్య యాత్రలు చేపట్టి, విస్తృత ఉద్యమానికి పిలుపునిస్తాము” అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, సిఐటియు ఉపాధ్యక్షులు ఎండి సలీం, సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, రైతు నాయకులు కుంభం కృష్ణారెడ్డి, అవుట్ రవీందర్, గంజి నాగరాజు, మన్నెం బిక్షం, పోలే సత్యనారాయణ, సర్దార్ అలీ, కట్ట అంజయ్య, బొల్లు రవీందర్, గంజి రాజేష్, ఆవుల అనురాధ, సల్లోజు విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రైతు–కార్మికుల హక్కులు మా హక్కులు! – నల్లగొండలో జెండా ఎగురేసిన నిరసన స్వరం

Article Image

నల్లగొండ, స్థానికం:

కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శుక్రవారం నల్లగొండలోని సుభాష్‌ విగ్రహం వద్ద సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్లజెండాలతో ఘోర నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ — “బీజేపీ ప్రభుత్వం రైతాంగం నల్ల చట్టాలను వ్యతిరేకంగా పోరాడిన సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టకుండా మోసం చేస్తోంది. కనీస మద్దతు ధర చట్టం, విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరణ హామీలను తుంగలో తొక్కి, కార్పొరేట్ ప్రయోజనాల దిశగా అడుగులు వేస్తోంది” అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
అలా “స్వాతంత్ర్యం ముందు కార్మికులు పోరాడి సాధించిన హక్కులను రద్దు చేసి, నాలుగు కొత్త లేబర్ కోడ్స్ పేరుతో కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చింది. వీటిని వెంటనే రద్దు చేయాలి” అని డిమాండ్ చేశారు.
తదుపరి వారు కొనసాగిస్తూ — “వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం విబిజీ రాంజీ చట్టంగా మార్చి రాష్ట్రాలకు నిధులు తగ్గించింది. దీంతో పథకం నిర్వీర్యమై గ్రామీణ కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడింది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

“కేంద్ర ప్రభుత్వం కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కులను దెబ్బతీస్తుంది. ఈ ప్రజా వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోతే, జనవరి 19 వరకు గ్రామ గ్రామాన చైతన్య యాత్రలు చేపట్టి, విస్తృత ఉద్యమానికి పిలుపునిస్తాము” అని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ, సిఐటియు ఉపాధ్యక్షులు ఎండి సలీం, సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, రైతు నాయకులు కుంభం కృష్ణారెడ్డి, అవుట్ రవీందర్, గంజి నాగరాజు, మన్నెం బిక్షం, పోలే సత్యనారాయణ, సర్దార్ అలీ, కట్ట అంజయ్య, బొల్లు రవీందర్, గంజి రాజేష్, ఆవుల అనురాధ, సల్లోజు విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News