Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:21 AM

రైకన్‌పేటలో నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

రైకన్‌పేటలో నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

రైకన్‌పేటలో నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
04-01-2026 107 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానిక ప్రతినిధి

గ్రామాభివృద్ధిపై సమిష్టి కృషికి పిలుపు

ఆత్మకూరు మండలం రైకన్‌పేట గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసంతో ఘన విజయం సాధించిన శ్రీమతి సుదగాని కలమ్మ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ తాళ్లపల్లి ఉప్పలయ్యతో పాటు ముగ్గురు వార్డు సభ్యులను శాలువాలు కప్పి గౌరవించారు.ఈ కార్యక్రమాన్ని సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను అభినందించిన ఆయన, గ్రామాభివృద్ధి మరియు గీత కార్మికుల సంక్షేమం దిశగా నూతన నాయకత్వం సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత, తాగునీరు, విద్యా–ఆరోగ్య రంగాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజల అంచనాలను నెరవేర్చేలా పారదర్శక పాలన అందించాలని పిలుపునిచ్చారు.ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సంఘ నాయకులు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

రైకన్‌పేటలో నూతన ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

Article Image

స్థానిక ప్రతినిధి

గ్రామాభివృద్ధిపై సమిష్టి కృషికి పిలుపు

ఆత్మకూరు మండలం రైకన్‌పేట గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల విశ్వాసంతో ఘన విజయం సాధించిన శ్రీమతి సుదగాని కలమ్మ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికైన సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ తాళ్లపల్లి ఉప్పలయ్యతో పాటు ముగ్గురు వార్డు సభ్యులను శాలువాలు కప్పి గౌరవించారు.ఈ కార్యక్రమాన్ని సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పరిటాల రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులను అభినందించిన ఆయన, గ్రామాభివృద్ధి మరియు గీత కార్మికుల సంక్షేమం దిశగా నూతన నాయకత్వం సమిష్టిగా పనిచేయాలని ఆకాంక్షించారు.గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత, తాగునీరు, విద్యా–ఆరోగ్య రంగాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ప్రజల అంచనాలను నెరవేర్చేలా పారదర్శక పాలన అందించాలని పిలుపునిచ్చారు.ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, సంఘ నాయకులు, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News