రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రాస్ కంట్రీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు
రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రాస్ కంట్రీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థులు
స్థానికం బృందం
మహబూబాబాద్, స్థానికం ప్రతినిధి
రాష్ట్రస్థాయి అథ్లెటిక్ క్రాస్ కంట్రీ పోటీలకు ఆదర్శ పాఠశాల విద్యార్థినులు ఎంపిక అయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ జి. ఉపేందర్ రావు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల మహబూబాద్ డిస్టిక్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ పోటీలలో స్థానిక అనంతరం ఆదర్శ పాఠశాల విద్యార్థులు వివిధ విభాగాలలో పోటీపడి 7 గురు విద్యార్థులు బాలికల అండర్ 18 సంవత్సరాల విభాగంలో నాలుగు కిలోమీటర్ల లో ఆర్.రాజేశ్వరి, బి.అక్షయ, బి.బిందు, అండర్ 20 సంవత్సరాల బాలికల విభాగంలో ఆరు కిలోమీటర్లలో బి.దీపిక, ఓ.అక్షిత, వి.భవ్యశ్రీ, అండర్ 20 సంవత్సరాల బాలుర విభాగంలో 8 కిలోమీటర్లలో ఎన్. నవీన్ ప్రతిభ కనబరిచి జనవరి 2 వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలలో పాల్గొంటారని అయన తెలిపారు,రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ జి ఉపేందర్ రావు పిడి కే. సింధువర్మ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి