రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి: ఎస్.కె.చాంద్
రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి: ఎస్.కె.చాంద్
స్థానికం బృందం
నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటా
రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి: ఎస్.కె.చాంద్
స్థానిక రామన్నపేట,
ప్రజల మధ్యే ఉంటూ నిరంతరం సేవ చేస్తానని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రామన్నపేట ఎంపీటీసీగా తప్పకుండా పోటీ చేస్తానని టీఆర్ఎస్ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు ఎస్.కె.చాంద్ స్పష్టం చేశారు.
రామన్నపేట మండలంలో వార్డు సభ్యుడిగా పోటీ చేసి సుమారు వందకు పైగా ఓట్లతో ప్రజల ఆశీర్వాదం పొందిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఓ తెలంగాణ ఉద్యమకారుడిగా, టీఆర్ఎస్ ఉద్యమ నేతగా ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని అన్నారు.
గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుంటానని పేర్కొన్న ఎస్.కె.చాంద్… రానున్న ఎన్నికల్లో ఎంపీటీసీగా బరిలోకి దిగుతూ ప్రజల మరింత ఆశీర్వాదం కోరారు. ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహమే తనకు బలమని, అదే తన సేవా పయనానికి ప్రేరణగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి