రామన్నపేటలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
రామన్నపేటలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు
స్థానికం బృందం
వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఉత్తర ద్వార దర్శనం
రామన్నపేట, స్థానికం ప్రతినిధి:
రామన్నపేట పట్టణంలోని ప్రసిద్ధ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారు ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆర్చనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామన్నపేట సర్పంచ్ గరిక సత్యనారాయణ రాధిక పాల్గొని లక్ష్మీ చెన్నకేశవ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉత్తర ద్వార దర్శనానికి ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణలు, గోవింద నామాలతో మార్మోగింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు.
వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి దర్శనంతో మోక్షప్రాప్తి కలుగుతుందన్న నమ్మకంతో భక్తులు అత్యంత భక్తిభావంతో పూజల్లో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి