రామన్నపేటలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
రామన్నపేటలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
స్థానికం బృందం
ప్రజాసేవే అసలైన రాజకీయాలు: సిపిఐ
రామన్నపేటలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం
రామన్నపేట స్థానికం ప్రతినిధి:
ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కంటే ప్రజల సమస్యలు పరిష్కరించడమే ముఖ్యమని సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ అన్నారు. సిపిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట శుక్రవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1925 డిసెంబర్ 26న లక్నోలో సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఐ పనిచేస్తోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా ఆస్తులు కూడబెట్టకుండా ప్రజల కోసమే జీవించిన నాయకుల చరిత్ర సిపిఐదేనని తెలిపారు.
కేరళలో వామపక్ష పాలన దేశానికే ఆదర్శమని, నిజమైన రాజకీయాలంటే కమ్యూనిస్టులదేనని నేటి పరిస్థితులు నిరూపిస్తున్నాయని అన్నారు. సిపిఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి