Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:46 AM

రామన్నపేటలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

రామన్నపేటలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

 రామన్నపేటలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం
26-12-2025 251 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజాసేవే అసలైన రాజకీయాలు: సిపిఐ

రామన్నపేటలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం

రామన్నపేట స్థానికం ప్రతినిధి:

ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కంటే ప్రజల సమస్యలు పరిష్కరించడమే ముఖ్యమని సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ అన్నారు. సిపిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట శుక్రవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1925 డిసెంబర్ 26న లక్నోలో సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఐ పనిచేస్తోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా ఆస్తులు కూడబెట్టకుండా ప్రజల కోసమే జీవించిన నాయకుల చరిత్ర సిపిఐదేనని తెలిపారు.

కేరళలో వామపక్ష పాలన దేశానికే ఆదర్శమని, నిజమైన రాజకీయాలంటే కమ్యూనిస్టులదేనని నేటి పరిస్థితులు నిరూపిస్తున్నాయని అన్నారు. సిపిఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Sthanikam

రామన్నపేటలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Article Image

ప్రజాసేవే అసలైన రాజకీయాలు: సిపిఐ

రామన్నపేటలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం

రామన్నపేట స్థానికం ప్రతినిధి:

ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం కంటే ప్రజల సమస్యలు పరిష్కరించడమే ముఖ్యమని సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ అన్నారు. సిపిఐ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేట మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట శుక్రవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 1925 డిసెంబర్ 26న లక్నోలో సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సిపిఐ పనిచేస్తోందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయినా ఆస్తులు కూడబెట్టకుండా ప్రజల కోసమే జీవించిన నాయకుల చరిత్ర సిపిఐదేనని తెలిపారు.

కేరళలో వామపక్ష పాలన దేశానికే ఆదర్శమని, నిజమైన రాజకీయాలంటే కమ్యూనిస్టులదేనని నేటి పరిస్థితులు నిరూపిస్తున్నాయని అన్నారు. సిపిఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా జనవరి 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News