రామన్నపేటలో ఘనంగా జెండా ఆవిష్కరణ
రామన్నపేటలో ఘనంగా జెండా ఆవిష్కరణ
Editor Desk
కాంగ్రెస్కు 140 ఏళ్ల ఘన చరిత్ర – పేదల పక్షాన పోరాటమే
రామన్నపేట స్థానికం ప్రతినిధి
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామన్నపేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జమీరుద్దీన్ అధ్యక్షతన జరగగా, ముఖ్య అతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిరిగి రెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన గొప్ప చరిత్ర కలిగిన పార్టీ. ఇందిరమ్మ రాజ్యం ద్వారా ప్రతి పేదవాడికి న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీనే. అలాంటి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉంది” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మెడి. రవిచంద్ర, రామన్నపేట సర్పంచ్ గరికే సత్యనారాయణ, పున్న జగన్, వనం చంద్రశేఖర్, గుత్త నర్సిరెడ్డి, మహమ్మద్ నాసర్, పిట్టా వెంకట్ రెడ్డి, మీర్జా బషీరబేగ్, సాల్వర్ అశోక్, ఎండీ అక్రం, చిల్లా సురేష్, మధురవేణి, కొత్తపల్లి అబ్రహం కుమార్, బొడ్డు సాలయ్య, గొలుసుల ప్రసాద్, కొమ్ము శేఖర్, కొమ్ము రామస్వామి, బత్తుల నవీన్, బొడ్డు శంకరయ్య, లావణం సాయి, ఎండీ హాజర్, కేశవదాస్, ఉదయ్, ఎండీ జానీ, కక్కిరేణి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి