Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:26 AM

రామన్నపేట రైల్వే బ్రిడ్జి వద్ద వర్షాకాల కష్టాలు – తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతున్న రైల్వే అధికారులు

రామన్నపేట రైల్వే బ్రిడ్జి వద్ద వర్షాకాల కష్టాలు – తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతున్న రైల్వే అధికారులు

రామన్నపేట రైల్వే బ్రిడ్జి వద్ద వర్షాకాల కష్టాలు – తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతున్న రైల్వే అధికారులు
December 24, 2025 04:37 PM 317 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట రైల్వే బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్య – తాత్కాలిక చర్యలకే పరిమితమైన రైల్వే అధికారులు

రామన్నపేట స్థానికం ప్రతినిధి

హైదరాబాద్–నల్గొండ రైల్వే మార్గంలోని ట్రాక్ నెంబర్ 419 పరిధిలో రామన్నపేట నుంచి సిరిపురం వెళ్లే రైల్వే బ్రిడ్జి వద్ద వర్షాలు పడిన ప్రతిసారి భారీగా నీరు నిల్వ ఉండటంతో నెలల తరబడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి రాపోలు నరసింహ రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, అధికారులు స్పందించి మోటర్లు ఏర్పాటు చేసి నిల్వ నీటిని తొలగిస్తూ తాత్కాలిక పరిష్కారానికి పరిమితమయ్యారు.

అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదని రామన్నపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మీర్జా ఫజల్ బేగ్ స్పష్టం చేశారు. వర్షాలు పడగానే సమస్య మళ్లీ యథావిధిగా ఉత్పన్నమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పైనుండి కిందికి వర్షపు నీరు జారకుండా సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు, ప్రస్తుతం మోటర్ల ద్వారా నీరు తోడుతున్నప్పటికీ మళ్లీ ఊట వస్తున్న పరిస్థితి ఉన్నందున శాశ్వత మోటర్ల ఏర్పాటు అవసరమని డిమాండ్ చేశారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిష్కారాలు అమలు చేసి, వర్షాకాలంలోనూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వే అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఉపాధ్యక్షుడు బత్తుల సత్యం, రామన్నపేట పట్టణ శాఖ అధ్యక్షుడు దిండిగల్ల రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News