రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
Editor Desk
రామన్నపేట: స్థానికం ప్రతినిధి
ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. మహిళా సాధికారత విభాగం, సామాజిక శాస్త్రాల విభాగాలు, ఎన్ఎస్ఎస్ యూనిట్–1, యూనిట్–2ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
వేడుకల్లో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. రహత్ ఖానం మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి విద్యే మూలమని నమ్మి పాఠశాలలు స్థాపించి బాలికలకు విద్యాబుద్ధులు నేర్పిన సావిత్రిబాయి పూలే గొప్ప మహనీయురాలని అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, పురుషులతో సమానంగా సమాజంలో గౌరవాన్ని దక్కించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా. పి. వెంకటేశ్వరరావు, మహిళా సాధికారత విభాగం కోఆర్డినేటర్ డా. సునీత, అకడమిక్ కోఆర్డినేటర్ డా. జే. చిన్నబాబు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఎం. అనిత, టి. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి