రామన్నపేట పాలకవర్గానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఘన సన్మానం
రామన్నపేట పాలకవర్గానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఘన సన్మానం
స్థానికం బృందం
పాలకవర్గానికి ఎమ్మెల్యే వేముల వీరేశం ఘన సన్మానం
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మేజర్ గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఘనంగా సన్మానించారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజాభిమానంతో విజయం సాధించిన సర్పంచ్, ఉపసర్పంచ్తో పాటు వార్డు సభ్యులకు శాలువాలు కప్పి పూలమాలలు వేసి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ… ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి పాలకవర్గం సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. రోడ్లు, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక వసతుల మెరుగుదలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందేలా చూడాలని కోరారు. గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రామన్నపేట గ్రామ అభివృద్ధిలో కొత్త పాలకవర్గం కీలక పాత్ర పోషిస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి