Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:10 AM

రామన్నపేట: మునిపంపుల గడ్డపై మళ్లీ ఎగిరిన ఎర్రజెండా!

రామన్నపేట: మునిపంపుల గడ్డపై మళ్లీ ఎగిరిన ఎర్రజెండా!

రామన్నపేట: మునిపంపుల గడ్డపై మళ్లీ ఎగిరిన ఎర్రజెండా!
16-12-2025 170 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునిపంపుల గడ్డపై మళ్లీ ఎగిరిన ఎర్రజెండా!

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన రామన్నపేట మండలం మునిపంపులలో మరోసారి ఎర్రజెండా రెపరెపలాడింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సీపీఎం బలపరిచిన అభ్యర్థి బొడ్డుపల్లి వెంకటేశ్ ఘనవిజయం సాధించారు. BRS మద్దతుతో బరిలోకి దిగిన సీపీఎం అభ్యర్థికి గ్రామ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపడంతో కాంగ్రెస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు వెనుదిరగాల్సి వచ్చింది.

గత ఎన్నికల్లోనూ సీపీఎం జెండా ఎగరేసిన మునిపంపుల గ్రామం, ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. ప్రజల సమస్యలపై నిరంతర పోరాటాలు, గ్రామాభివృద్ధిపై స్పష్టమైన దృష్టికోణం వెంకటేశ్‌కు విజయాన్ని అందించాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

SFI సభ్యుడిగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన వెంకటేశ్, అంచెలంచెలుగా ఎదిగి సర్పంచ్ స్థాయికి చేరడం గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తోందని గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విజయం కమ్యూనిస్టు శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, రాబోయే రాజకీయ సమీకరణాలపై చర్చకు తెరలేపింది.

Sthanikam

రామన్నపేట: మునిపంపుల గడ్డపై మళ్లీ ఎగిరిన ఎర్రజెండా!

Article Image

మునిపంపుల గడ్డపై మళ్లీ ఎగిరిన ఎర్రజెండా!

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన రామన్నపేట మండలం మునిపంపులలో మరోసారి ఎర్రజెండా రెపరెపలాడింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సీపీఎం బలపరిచిన అభ్యర్థి బొడ్డుపల్లి వెంకటేశ్ ఘనవిజయం సాధించారు. BRS మద్దతుతో బరిలోకి దిగిన సీపీఎం అభ్యర్థికి గ్రామ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపడంతో కాంగ్రెస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు వెనుదిరగాల్సి వచ్చింది.

గత ఎన్నికల్లోనూ సీపీఎం జెండా ఎగరేసిన మునిపంపుల గ్రామం, ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. ప్రజల సమస్యలపై నిరంతర పోరాటాలు, గ్రామాభివృద్ధిపై స్పష్టమైన దృష్టికోణం వెంకటేశ్‌కు విజయాన్ని అందించాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

SFI సభ్యుడిగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన వెంకటేశ్, అంచెలంచెలుగా ఎదిగి సర్పంచ్ స్థాయికి చేరడం గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తోందని గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విజయం కమ్యూనిస్టు శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, రాబోయే రాజకీయ సమీకరణాలపై చర్చకు తెరలేపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News