రామన్నపేట: మునిపంపుల గడ్డపై మళ్లీ ఎగిరిన ఎర్రజెండా!
రామన్నపేట: మునిపంపుల గడ్డపై మళ్లీ ఎగిరిన ఎర్రజెండా!
స్థానికం బృందం
మునిపంపుల గడ్డపై మళ్లీ ఎగిరిన ఎర్రజెండా!
స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
కమ్యూనిస్టుల కంచుకోటగా పేరొందిన రామన్నపేట మండలం మునిపంపులలో మరోసారి ఎర్రజెండా రెపరెపలాడింది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో సీపీఎం బలపరిచిన అభ్యర్థి బొడ్డుపల్లి వెంకటేశ్ ఘనవిజయం సాధించారు. BRS మద్దతుతో బరిలోకి దిగిన సీపీఎం అభ్యర్థికి గ్రామ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపడంతో కాంగ్రెస్, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు వెనుదిరగాల్సి వచ్చింది.
గత ఎన్నికల్లోనూ సీపీఎం జెండా ఎగరేసిన మునిపంపుల గ్రామం, ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. ప్రజల సమస్యలపై నిరంతర పోరాటాలు, గ్రామాభివృద్ధిపై స్పష్టమైన దృష్టికోణం వెంకటేశ్కు విజయాన్ని అందించాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
SFI సభ్యుడిగా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన వెంకటేశ్, అంచెలంచెలుగా ఎదిగి సర్పంచ్ స్థాయికి చేరడం గ్రామ యువతకు ఆదర్శంగా నిలుస్తోందని గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ విజయం కమ్యూనిస్టు శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపగా, రాబోయే రాజకీయ సమీకరణాలపై చర్చకు తెరలేపింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి