రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్
రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన ఏజీపీగా సుక్క శ్రవణ్
Editor Desk
ప్రభుత్వ న్యాయవాదిగా సుక్క శ్రవణ్ ఎన్నిక
రామన్న పేట స్థానిక ప్రతినిధి
రామన్నపేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నూతన అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా (ఏజీపీ) సుక్క శ్రవణ్ నియమితులయ్యారు. ఈ నియామకానికి సహకరించిన ప్రజాప్రతినిధులు,న్యాయవాదులు, పార్టీ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.తన నియామకానికి సహకరించిన గౌరవ శాసన సభ్యుడు వేముల వీరేశం, జిల్లా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీనియర్ న్యాయవాది, మాజీ జెడ్పిటిసి జనుకల ప్రభాకర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రామన్నపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ మజీద్తో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు అందించిన సహకారాన్ని గుర్తు చేసుకున్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగుల వెంకట్ రాజి రెడ్డి, మల్లా రెడ్డి, ఎండీ అక్రమ్, పృద్వీ తదితరులకు కూడా సుక్క శ్రవణ్ కృతజ్ఞతలు తెలిపారు. తన నియామకాన్ని స్వాగతిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసినట్లు ఆయన వెల్లడించారు.
ప్రభుత్వ న్యాయవాదిగా న్యాయవ్యవస్థపై ఉన్న బాధ్యతను గుర్తుంచుకొని న్యాయం, నిష్పక్షపాతతతో విధులు నిర్వహిస్తానని సుక్క శ్రవణ్ తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి