Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
“ఈ సమస్య పరిష్కరించేది ఎప్పుడో...?” “తాత్కాలికం కాదు… శాశ్వత పరిష్కారం సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 08:15 AM

రాజకీయాల్లో నాయి బ్రాహ్మణులు ముందుండాలి

రాజకీయాల్లో నాయి బ్రాహ్మణులు ముందుండాలి

రాజకీయాల్లో నాయి బ్రాహ్మణులు ముందుండాలి
December 31, 2025 05:54 PM 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నాయి బ్రాహ్మణ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగభూషణం

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి

రాజకీయ సమీకరణాలలో నాయి బ్రాహ్మణులు ముందుండి ఉనికిని చాటాలని నాయి బ్రాహ్మణ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగభూషణం, పట్టణ అధ్యక్షులు లకుడాలం మాణిక్ ప్రభు, ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్యలు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నాయి బ్రాహ్మణ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు బుధవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ కార్యాలయంలో ఆత్మీయ సన్మానం చేసి మాట్లాడారు. మనిషి పుట్టుక నుండి చావు వరకు ప్రతి పనిలో ముందుండే నాయి బ్రాహ్మణులు రాజకీయ రంగంలో మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. నాటి కాలంలో నాయి లైన నందవంశ రాజులు రాజ్యాలను ఏలారని గుర్తు చేశారు. నిస్వార్థ ముఖ్యమంత్రిగా సేవలందించిన నాయి బ్రాహ్మణ కర్పూరి ఠాకూర్ స్ఫూర్తితో నాయిలందరూ రాజకీయంగా మరింత ఎదుగుదలకు కృషి చేయాలని సూచించారు. రాజకీయాలలో అనిచ్చితత్వం కొరబడటం రాజకీయ సమీకరణాల ఆవశ్యకతను సూచిస్తుందన్నారు. జిల్లాలో పోటీ చేసిన నాయి బ్రాహ్మణులు అందరూ గెలుపొందడం పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం మేరకు భవిష్యత్తు రాజకీయాల్లో నాయిలు ముందుంటారని సూచిస్తుందన్నారు. అవకాశం ఉన్న ప్రతి స్థానంలో రాజకీయంగా నాయి బ్రాహ్మణులు పోటీలో ఉండాలని సూచించారు. గెలుపొందిన నాయి బ్రాహ్మణ నాయకులు వృత్తిదారుల ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. సమాజంలో నాయిలు అస్పృశ్యతకు లోను కాకుండా మరింత సంఘటితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివకాంతం, జిల్లా నాయకులు వీరన్న, సత్యం, ఆంజనేయులు, మురళి, ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షులు కిష్టయ్య, సుధామణి, పట్టణ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, సహాయ కార్యదర్శి మురళి, పెంటయ్య, స్వాగత్ ప్రభు, హనుమంతు, చరణ్, రాము, మండల అధ్యక్షులు, ఉపసర్పంచ్లు, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News