రాజకీయాల్లో నాయి బ్రాహ్మణులు ముందుండాలి
రాజకీయాల్లో నాయి బ్రాహ్మణులు ముందుండాలి
Sthanikam District Staff Reporter krishna
నాయి బ్రాహ్మణ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నాగభూషణం
సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి
రాజకీయ సమీకరణాలలో నాయి బ్రాహ్మణులు ముందుండి ఉనికిని చాటాలని నాయి బ్రాహ్మణ సంఘం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగభూషణం, పట్టణ అధ్యక్షులు లకుడాలం మాణిక్ ప్రభు, ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు యాదయ్యలు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నాయి బ్రాహ్మణ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లకు బుధవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం పట్టణ కమిటీ కార్యాలయంలో ఆత్మీయ సన్మానం చేసి మాట్లాడారు. మనిషి పుట్టుక నుండి చావు వరకు ప్రతి పనిలో ముందుండే నాయి బ్రాహ్మణులు రాజకీయ రంగంలో మరింత ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. నాటి కాలంలో నాయి లైన నందవంశ రాజులు రాజ్యాలను ఏలారని గుర్తు చేశారు. నిస్వార్థ ముఖ్యమంత్రిగా సేవలందించిన నాయి బ్రాహ్మణ కర్పూరి ఠాకూర్ స్ఫూర్తితో నాయిలందరూ రాజకీయంగా మరింత ఎదుగుదలకు కృషి చేయాలని సూచించారు. రాజకీయాలలో అనిచ్చితత్వం కొరబడటం రాజకీయ సమీకరణాల ఆవశ్యకతను సూచిస్తుందన్నారు. జిల్లాలో పోటీ చేసిన నాయి బ్రాహ్మణులు అందరూ గెలుపొందడం పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం మేరకు భవిష్యత్తు రాజకీయాల్లో నాయిలు ముందుంటారని సూచిస్తుందన్నారు. అవకాశం ఉన్న ప్రతి స్థానంలో రాజకీయంగా నాయి బ్రాహ్మణులు పోటీలో ఉండాలని సూచించారు. గెలుపొందిన నాయి బ్రాహ్మణ నాయకులు వృత్తిదారుల ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. సమాజంలో నాయిలు అస్పృశ్యతకు లోను కాకుండా మరింత సంఘటితం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివకాంతం, జిల్లా నాయకులు వీరన్న, సత్యం, ఆంజనేయులు, మురళి, ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షులు కిష్టయ్య, సుధామణి, పట్టణ గౌరవ అధ్యక్షులు దత్తాత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, సహాయ కార్యదర్శి మురళి, పెంటయ్య, స్వాగత్ ప్రభు, హనుమంతు, చరణ్, రాము, మండల అధ్యక్షులు, ఉపసర్పంచ్లు, వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి