రాజీ మార్గంలో న్యాయం… లోక్ అదాలత్తో సాధ్యం.డీఎస్పీ వెంకట్ రెడ్డి
రాజీ మార్గంలో న్యాయం… లోక్ అదాలత్తో సాధ్యం.డీఎస్పీ వెంకట్ రెడ్డి
Editor Desk
జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: ఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి
స్థానికం ప్రతినిధి సంగారెడ్డి
ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. రాజీ మార్గంలో అనేక కేసులకు తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు.
సివిల్ కేసులతో పాటు క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, కుటుంబ వివాదాలు, చెక్ బౌన్స్, ట్రాఫిక్ ఉల్లంఘనలు, బ్యాంకు రికవరీ వంటి అంశాలను లోక్ అదాలత్ ద్వారా త్వరగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. దీర్ఘకాలంగా కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, సమయాన్ని, ఖర్చును ఆదా చేసుకునే మంచి అవకాశం ఇదన్నారు.
న్యాయపరమైన చిక్కులు లేకుండా పరస్పర అంగీకారంతో కేసులు ముగించుకునే వీలుందని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించడంలో లోక్ అదాలత్ కీలక పాత్ర పోషిస్తుందని, బాధితులు ముందుకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి