Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:56 AM

రాచకొండలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్: 303 మందిపై కేసులు

రాచకొండలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్: 303 మందిపై కేసులు

  రాచకొండలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్: 303 మందిపై కేసులు
December 29, 2025 06:37 PM 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాచకొండలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్

303 మందిపై కేసులు నమోదు

స్థానికం ప్రతినిధి

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22.12.2025 నుంచి 28.12.2025 వరకు వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 303 మందిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 242 మంది ద్విచక్ర వాహనదారులు, 11 ఆటో డ్రైవర్లు, 50 కార్ల డ్రైవర్లు ఉన్నారు.

బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా పరిశీలిస్తే,

278 మంది 35 mg/100 ml నుంచి 200 mg/100 ml మధ్య,

19 మంది 201 mg/100 ml నుంచి 300 mg/100 ml మధ్య,

6 మంది 301 mg/100 ml నుంచి 550 mg/100 ml వరకు ఆల్కహాల్ సేవించినట్లు తేలింది.

వీరందరినీ చట్టప్రకారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని రాచకొండ పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేరానికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.

ఇదిలా ఉండగా, గత వారంలో నమోదైన 68 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించగా, అందులోని 68 మందికి రూ.2,07,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News