రాచకొండలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్: 303 మందిపై కేసులు
రాచకొండలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్: 303 మందిపై కేసులు
స్థానికం బృందం
రాచకొండలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్
303 మందిపై కేసులు నమోదు
స్థానికం ప్రతినిధి
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22.12.2025 నుంచి 28.12.2025 వరకు వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.
ఈ ప్రత్యేక డ్రైవ్లో మొత్తం 303 మందిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 242 మంది ద్విచక్ర వాహనదారులు, 11 ఆటో డ్రైవర్లు, 50 కార్ల డ్రైవర్లు ఉన్నారు.
బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా పరిశీలిస్తే,
278 మంది 35 mg/100 ml నుంచి 200 mg/100 ml మధ్య,
19 మంది 201 mg/100 ml నుంచి 300 mg/100 ml మధ్య,
6 మంది 301 mg/100 ml నుంచి 550 mg/100 ml వరకు ఆల్కహాల్ సేవించినట్లు తేలింది.
వీరందరినీ చట్టప్రకారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని రాచకొండ పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేరానికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.
ఇదిలా ఉండగా, గత వారంలో నమోదైన 68 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించగా, అందులోని 68 మందికి రూ.2,07,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి