Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 06:21 AM

రాచకొండలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్: 303 మందిపై కేసులు

రాచకొండలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్: 303 మందిపై కేసులు

  రాచకొండలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్: 303 మందిపై కేసులు
December 29, 2025 06:37 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాచకొండలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్

303 మందిపై కేసులు నమోదు

స్థానికం ప్రతినిధి

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22.12.2025 నుంచి 28.12.2025 వరకు వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 303 మందిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 242 మంది ద్విచక్ర వాహనదారులు, 11 ఆటో డ్రైవర్లు, 50 కార్ల డ్రైవర్లు ఉన్నారు.

బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా పరిశీలిస్తే,

278 మంది 35 mg/100 ml నుంచి 200 mg/100 ml మధ్య,

19 మంది 201 mg/100 ml నుంచి 300 mg/100 ml మధ్య,

6 మంది 301 mg/100 ml నుంచి 550 mg/100 ml వరకు ఆల్కహాల్ సేవించినట్లు తేలింది.

వీరందరినీ చట్టప్రకారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని రాచకొండ పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేరానికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.

ఇదిలా ఉండగా, గత వారంలో నమోదైన 68 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించగా, అందులోని 68 మందికి రూ.2,07,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News