Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:47 AM

రాచకొండలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్: 303 మందిపై కేసులు

రాచకొండలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్: 303 మందిపై కేసులు

  రాచకొండలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్: 303 మందిపై కేసులు
29-12-2025 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాచకొండలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్

303 మందిపై కేసులు నమోదు

స్థానికం ప్రతినిధి

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22.12.2025 నుంచి 28.12.2025 వరకు వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 303 మందిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 242 మంది ద్విచక్ర వాహనదారులు, 11 ఆటో డ్రైవర్లు, 50 కార్ల డ్రైవర్లు ఉన్నారు.

బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా పరిశీలిస్తే,

278 మంది 35 mg/100 ml నుంచి 200 mg/100 ml మధ్య,

19 మంది 201 mg/100 ml నుంచి 300 mg/100 ml మధ్య,

6 మంది 301 mg/100 ml నుంచి 550 mg/100 ml వరకు ఆల్కహాల్ సేవించినట్లు తేలింది.

వీరందరినీ చట్టప్రకారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని రాచకొండ పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేరానికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.

ఇదిలా ఉండగా, గత వారంలో నమోదైన 68 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించగా, అందులోని 68 మందికి రూ.2,07,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు వెల్లడించారు.

Sthanikam

రాచకొండలో వీకెండ్ డ్రంక్ డ్రైవ్: 303 మందిపై కేసులు

Article Image

రాచకొండలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్

303 మందిపై కేసులు నమోదు

స్థానికం ప్రతినిధి

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 22.12.2025 నుంచి 28.12.2025 వరకు వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నారు.

ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 303 మందిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 242 మంది ద్విచక్ర వాహనదారులు, 11 ఆటో డ్రైవర్లు, 50 కార్ల డ్రైవర్లు ఉన్నారు.

బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ (బిఎసి) ఆధారంగా పరిశీలిస్తే,

278 మంది 35 mg/100 ml నుంచి 200 mg/100 ml మధ్య,

19 మంది 201 mg/100 ml నుంచి 300 mg/100 ml మధ్య,

6 మంది 301 mg/100 ml నుంచి 550 mg/100 ml వరకు ఆల్కహాల్ సేవించినట్లు తేలింది.

వీరందరినీ చట్టప్రకారం కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని రాచకొండ పోలీసులు హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేరానికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.

ఇదిలా ఉండగా, గత వారంలో నమోదైన 68 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించగా, అందులోని 68 మందికి రూ.2,07,500 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News