రాచకొండలో 3వ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
రాచకొండలో 3వ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
స్థానికం బృందం
గోల్డెన్ కేర్ ద్వారా వృద్ధులకు సమగ్ర వైద్య సేవలు
రాచకొండలో 3వ మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహణ
స్థానికం ప్రతినిధి హైదరాబాద్
వృద్ధుల సహాయం, సంరక్షణ లక్ష్యంగా రూపొందించిన అత్యున్నత కార్యక్రమం గోల్డెన్ కేర్ (GOLDEN CARE) లో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్, రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ (RKSC) సంయుక్త ఆధ్వర్యంలో మూడో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని బుధవారం లక్ష్మీ గార్డెన్స్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్ ఆలోచనాత్మక దృక్పథానికి నిదర్శనంగా నిలిచింది.
శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ, వృద్ధుల ఆరోగ్యం, భద్రత పట్ల పోలీస్ శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. గోల్డెన్ కేర్ కార్యక్రమం ద్వారా వృద్ధులకు అవసరమైన సేవలు ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.
ఈ శిబిరం ద్వారా మొత్తం 244 మంది వృద్ధులకు సమగ్ర వైద్య సేవలు అందించారు. GEMCARE, జిమ్ కేర్ పాలొమీ, సోలి ఐ కేర్, సౌజన్య డెంటల్, మా ఈఎన్టీ సంస్థల సహకారంతో జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, డెంటిస్ట్రీ, ఆప్తాల్మాలజీ విభాగాల్లో నిపుణులైన వైద్యులు సంప్రదింపులు జరిపారు. అదేవిధంగా ఈసీజీ, రక్తపోటు, రాండమ్ బ్లడ్ షుగర్ వంటి కీలక పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.
వృద్ధుల సంక్షేమం పట్ల తమ అంకితభావాన్ని ఈ సందర్భంగా అధికారులు మరోసారి పునరుద్ఘాటించారు. ఒకే వేదికపై అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించినందుకు లబ్ధిదారులు రాచకొండ పోలీస్ కమిషనరేట్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషారాణి, మల్కాజిగిరి అదనపు డీసీపీ వెంకట రమణ, కుషాయిగూడ ఏసీపీ వై. వెంకట్ రెడ్డి, ఉమెన్ సేఫ్టీ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్కెఎస్సి జాయింట్ సెక్రటరీ రాధికానాథ్, చీఫ్ కోఆర్డినేటర్ ఎం. సావిత్రి, కె. సూర్యనారాయణతో పాటు కుషాయిగూడ, నెరేడ్మెట్, చర్లపల్లి, జవహర్నగర్, కీసర సీఐలు, షీటీమ్ సీఐలు ఎం. ముని, అంజయ్యలు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి