Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెరుగుతుంది. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 15, 2026 02:32 PM

పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెరుగుతుంది. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం

పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెరుగుతుంది. కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం

పుస్తక పఠనంతోనే విజ్ఞానం పెరుగుతుంది.  కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం
May 15, 2026 01:29 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాలు ఐదో రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన, పుస్తకాల పంపిణీ, పుస్తక సమీక్ష, ఉత్తమ పాఠకులకు బహుమతుల ప్రదానం కార్యక్రమాలు చేపట్టారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు గ్రంథాలయంలోని పుస్తకాలను కూడా అధ్యయనం చేసినప్పుడే విస్తృతమైన విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని తెలిపారు. తలదించుకొని చదివినప్పుడే తలెత్తుకొని జీవించే స్థాయికి పుస్తకాలు తీసుకెళ్తాయని పేర్కొన్నారు.

కార్యక్రమ ఇన్‌చార్జి డాక్టర్ రాచమళ్ల శ్రీను మాట్లాడుతూ.. పోటీ పరీక్షలు, ఉన్నత విద్యకు సంబంధించిన పుస్తకాలు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య.. తండు సాయన్నదాసు రచించిన ‘సాయన తత్వాలు’ పుస్తకాన్ని సమీక్షించారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, పరిపాలనాధికారి జి. కరుణాకర్, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News