Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:54 PM

పురపాలికకు కొత్త చైర్మన్ పదవి ఎవరికి?

పురపాలికకు కొత్త చైర్మన్ పదవి ఎవరికి?

పురపాలికకు కొత్త చైర్మన్ పదవి ఎవరికి?
February 15, 2026 02:54 PM 539 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

20 వార్డులు ఉన్న చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 13 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. దీంతో చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలో పడిపోయింది. ఆ కిరీటం ఎవరిని వరించబోతుంది అన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఈసారి చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో ఆ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత పోటీ పెరిగింది. కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన 9వ వార్డు అభ్యర్థి మోగుదాల పావని, 13వ వార్డు అభ్యర్థి బత్తుల వాణి, 7వ వార్డు అభ్యర్థి కాసర్ల మంజుల పేర్లు చైర్మన్ రేస్ లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముగ్గురు తమ వర్గాల మద్దతుతో చైర్మన్ రేసు లో ముందు ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఇప్పటికే అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో పట్టణ రాజకీయాల్లో వాడి.. వేడి చర్చలు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులు ఎవరికి దక్కుతాయన్నది కీలకంగా మారింది. ఎమ్మెల్యే సూచనలే తుది నిర్ణయానికి మార్గం చూపుతాయని అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.


ఒక్కొక్కరిది ఒక్కో బలం

చౌటుప్పల్ చైర్మన్ పదవి జనరల్ మహిళలకు కేటాయించడంతో సామాజిక సమీకరణాలు, రాజకీయ సమతుల్యత, పార్టీ నాయకత్వ సలహాతో చైర్మన్ పీఠం ఎవరికి ఇవ్వాలనేది తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో 24 గంటల్లో జరిగే ఎన్నికలో చౌటుప్పల్ పురపాలికకు కొత్త చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠంగా మారింది. కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకున్న ఈ పీఠం చివరికి ఎవరి తలపై కిరీటంగా మెరవబోతుందో చూడాలని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News