Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:08 PM

పురపాలికకు కొత్త చైర్మన్ పదవి ఎవరికి?

పురపాలికకు కొత్త చైర్మన్ పదవి ఎవరికి?

పురపాలికకు కొత్త చైర్మన్ పదవి ఎవరికి?
February 15, 2026 02:54 PM 548 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

20 వార్డులు ఉన్న చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 13 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. దీంతో చైర్మన్ పీఠం కాంగ్రెస్ ఖాతాలో పడిపోయింది. ఆ కిరీటం ఎవరిని వరించబోతుంది అన్నది మాత్రం ఇంకా తేలలేదు. ఈసారి చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో ఆ పదవి కోసం కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గత పోటీ పెరిగింది. కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన 9వ వార్డు అభ్యర్థి మోగుదాల పావని, 13వ వార్డు అభ్యర్థి బత్తుల వాణి, 7వ వార్డు అభ్యర్థి కాసర్ల మంజుల పేర్లు చైర్మన్ రేస్ లో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ముగ్గురు తమ వర్గాల మద్దతుతో చైర్మన్ రేసు లో ముందు ఉండేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నెల 16న చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు ఇప్పటికే అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో పట్టణ రాజకీయాల్లో వాడి.. వేడి చర్చలు జరుగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీస్సులు ఎవరికి దక్కుతాయన్నది కీలకంగా మారింది. ఎమ్మెల్యే సూచనలే తుది నిర్ణయానికి మార్గం చూపుతాయని అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతుంది.


ఒక్కొక్కరిది ఒక్కో బలం

చౌటుప్పల్ చైర్మన్ పదవి జనరల్ మహిళలకు కేటాయించడంతో సామాజిక సమీకరణాలు, రాజకీయ సమతుల్యత, పార్టీ నాయకత్వ సలహాతో చైర్మన్ పీఠం ఎవరికి ఇవ్వాలనేది తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో 24 గంటల్లో జరిగే ఎన్నికలో చౌటుప్పల్ పురపాలికకు కొత్త చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠంగా మారింది. కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకున్న ఈ పీఠం చివరికి ఎవరి తలపై కిరీటంగా మెరవబోతుందో చూడాలని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News