Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:14 PM

పురపాలక ఎన్నికలలో మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ

పురపాలక ఎన్నికలలో మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ

పురపాలక ఎన్నికలలో మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ
February 07, 2026 07:08 PM 302 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పురపాలక ఎన్నికలలో బీఆర్ఎస్, సిపిఐఎం మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో 9వ వార్డు అభ్యర్థి దండ అరుణ్,10వ వార్డు గోశిక సుమతి, 16వ వార్డు బత్తుల జయమ్మ,19వ వార్డు బత్తుల శ్రీశైలం గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారంలో మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్దించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...పురపాలక ఎన్నికలలో నాయకులు, కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా చివరి నిమిషం వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.వార్డు సమస్యలు పరిష్కారం కావాలి అంటే మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. పురపాలక కేంద్రంలో డ్రైనేజీ, రోడ్డు, మంచినీటి సమస్యలచేత అనునిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం అభివృద్ధి, వార్డుల అభివృద్ధి మిత్రపక్షాల బలపరిచిన అభ్యర్థులతోనే సాధ్యం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించిందని అన్నారు. అలోచన చేసి అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచారంలో మాజీ జడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు గిర్కటి నిరంజన్,బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి సీపీఎం నాయకులు బూరుగు కృష్ణ రెడ్డి, ఎండి పాష, గోశిక కరుణకర్, గంగాదేవి సైదులు,జెల్లల పెంటయ్య, వనం ఉపేందర్, గుణమోని ఐలయ్య, బొడ్డు అంజిరెడ్డి, చింతల మధుసుధన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News