Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:57 PM

పురపాలక ఎన్నికలలో మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ

పురపాలక ఎన్నికలలో మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ

పురపాలక ఎన్నికలలో మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ
February 07, 2026 07:08 PM 297 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పురపాలక ఎన్నికలలో బీఆర్ఎస్, సిపిఐఎం మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో 9వ వార్డు అభ్యర్థి దండ అరుణ్,10వ వార్డు గోశిక సుమతి, 16వ వార్డు బత్తుల జయమ్మ,19వ వార్డు బత్తుల శ్రీశైలం గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారంలో మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్దించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...పురపాలక ఎన్నికలలో నాయకులు, కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా చివరి నిమిషం వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.వార్డు సమస్యలు పరిష్కారం కావాలి అంటే మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. పురపాలక కేంద్రంలో డ్రైనేజీ, రోడ్డు, మంచినీటి సమస్యలచేత అనునిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం అభివృద్ధి, వార్డుల అభివృద్ధి మిత్రపక్షాల బలపరిచిన అభ్యర్థులతోనే సాధ్యం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించిందని అన్నారు. అలోచన చేసి అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచారంలో మాజీ జడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు గిర్కటి నిరంజన్,బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి సీపీఎం నాయకులు బూరుగు కృష్ణ రెడ్డి, ఎండి పాష, గోశిక కరుణకర్, గంగాదేవి సైదులు,జెల్లల పెంటయ్య, వనం ఉపేందర్, గుణమోని ఐలయ్య, బొడ్డు అంజిరెడ్డి, చింతల మధుసుధన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News