Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:01 PM

పురపాలక ఎన్నికలలో మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ

పురపాలక ఎన్నికలలో మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ

పురపాలక ఎన్నికలలో మిత్రపక్ష అభ్యర్థులను గెలిపించాలి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ
February 07, 2026 07:08 PM 293 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పురపాలక ఎన్నికలలో బీఆర్ఎస్, సిపిఐఎం మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ అన్నారు. శనివారం పట్టణ కేంద్రంలో 9వ వార్డు అభ్యర్థి దండ అరుణ్,10వ వార్డు గోశిక సుమతి, 16వ వార్డు బత్తుల జయమ్మ,19వ వార్డు బత్తుల శ్రీశైలం గెలుపు కోరుతూ ఇంటింటి ప్రచారంలో మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జూన్ వేస్లీ ఓటు వేసి గెలిపించాలని అభ్యర్దించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ...పురపాలక ఎన్నికలలో నాయకులు, కార్యకర్తలు గెలుపే లక్ష్యంగా చివరి నిమిషం వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.వార్డు సమస్యలు పరిష్కారం కావాలి అంటే మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు. పురపాలక కేంద్రంలో డ్రైనేజీ, రోడ్డు, మంచినీటి సమస్యలచేత అనునిత్యం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం అభివృద్ధి, వార్డుల అభివృద్ధి మిత్రపక్షాల బలపరిచిన అభ్యర్థులతోనే సాధ్యం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించిందని అన్నారు. అలోచన చేసి అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు. ఈ ప్రచారంలో మాజీ జడ్పీటీసీ పెద్దింటి బుచ్చిరెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు గిర్కటి నిరంజన్,బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, చింతల వెంకటేశ్వర్ రెడ్డి సీపీఎం నాయకులు బూరుగు కృష్ణ రెడ్డి, ఎండి పాష, గోశిక కరుణకర్, గంగాదేవి సైదులు,జెల్లల పెంటయ్య, వనం ఉపేందర్, గుణమోని ఐలయ్య, బొడ్డు అంజిరెడ్డి, చింతల మధుసుధన్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News