Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:02 AM

ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన
January 10, 2026 12:47 AM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు లబ్ధిదారులు మరియు అధికారులను ఆదేశించారు.శుక్రవారం బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి,వాటిలో ఎన్ని వివిధ దశల్లో ఉన్నాయనే వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వివిధ దశల్లో ఉన్న ఇండ్ల నిర్మాణాలను ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ప్రభుత్వ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్నదని పేర్కొంటూ,రెండో విడతలో కూడా కొత్త ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం మంజూరైన ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేస్తే,తదుపరి దశలో గ్రామానికి మరిన్ని ఇండ్లు మంజూరు అయ్యే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News