Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:31 PM

ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన
10-01-2026 68 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు లబ్ధిదారులు మరియు అధికారులను ఆదేశించారు.శుక్రవారం బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి,వాటిలో ఎన్ని వివిధ దశల్లో ఉన్నాయనే వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వివిధ దశల్లో ఉన్న ఇండ్ల నిర్మాణాలను ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ప్రభుత్వ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్నదని పేర్కొంటూ,రెండో విడతలో కూడా కొత్త ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం మంజూరైన ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేస్తే,తదుపరి దశలో గ్రామానికి మరిన్ని ఇండ్లు మంజూరు అయ్యే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

Article Image

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు లబ్ధిదారులు మరియు అధికారులను ఆదేశించారు.శుక్రవారం బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి,వాటిలో ఎన్ని వివిధ దశల్లో ఉన్నాయనే వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వివిధ దశల్లో ఉన్న ఇండ్ల నిర్మాణాలను ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ప్రభుత్వ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్నదని పేర్కొంటూ,రెండో విడతలో కూడా కొత్త ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం మంజూరైన ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేస్తే,తదుపరి దశలో గ్రామానికి మరిన్ని ఇండ్లు మంజూరు అయ్యే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News