Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:06 AM

ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన

ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయి పరిశీలన
January 10, 2026 12:47 AM 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు లబ్ధిదారులు మరియు అధికారులను ఆదేశించారు.శుక్రవారం బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొత్తం ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి,వాటిలో ఎన్ని వివిధ దశల్లో ఉన్నాయనే వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వివిధ దశల్లో ఉన్న ఇండ్ల నిర్మాణాలను ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేపట్టాలని సూచించారు. నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే ప్రభుత్వ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్నదని పేర్కొంటూ,రెండో విడతలో కూడా కొత్త ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం మంజూరైన ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేస్తే,తదుపరి దశలో గ్రామానికి మరిన్ని ఇండ్లు మంజూరు అయ్యే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News