Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 08:07 AM

ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కారం:జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కారం:జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలకు నేరుగా పరిష్కారం:జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
January 12, 2026 02:48 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

ప్రజల సమస్యలకు వేగంగా, సమర్థవంతంగా పరిష్కారం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సోమవారం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని, వెంటనే పరిష్కార చర్యలు చేపట్టడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి జిల్లా ఎస్పీ స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను శ్రద్ధగా విని, సంబంధిత కేసులకు సంబంధించిన వివరాలను ఆయా పోలీస్ స్టేషన్‌ల ఎస్‌.హెచ్‌.ఓలతో ఫోన్ ద్వారా సంప్రదించి తెలుసుకున్నారు. ఫిర్యాదులపై ఎలాంటి పక్షపాతం లేకుండా, పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధితులకు పూర్తి న్యాయం చేకూర్చాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.అలాగే ప్రజావాణి ద్వారా స్వీకరించిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ, కేసుల పురోగతిపై నిరంతరంగా సమీక్ష నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పోలీస్ శాఖ పని చేయాలని, ప్రతి ఫిర్యాదుకు సమయపాలనతో స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ, స్థానిక పోలీస్ స్టేషన్‌లలో పరిష్కారం కాని సమస్యలపై ఎలాంటి భయాలు, ఒత్తిళ్లకు లోనుకాకుండా జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులన్నింటికీ ప్రాధాన్యత ఇస్తూ, త్వరితగతిన పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని, బాధితులకు పూర్తి భరోసా కల్పిస్తామని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News