Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 08:06 AM

ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా నవతెలంగాణ*

ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా నవతెలంగాణ*

ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా నవతెలంగాణ*
January 14, 2026 05:50 PM 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా నవ తెలంగాణ పత్రిక పనిచేస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ అన్నారు.. నారాయణఖేడ్ పట్టణంలో తన నివాసం వద్ద 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నవతెలంగాణ పత్రిక ప్రజల పక్షం వహిస్తుందని, సమగ్రమైన కథనాలు, ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన ప్రజల ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. ప్రజల యొక్క సమస్యలను వెలికితీయడంలో ముందు వరుసలో ఉందన్నారు. ముఖ్యంగా విశ్లేషణాత్మకమైన, సమగ్రమైన సమాచారం తో ప్రజలకు అందిస్తుందన్నారు. అట్టడుగు వర్గాల సమస్యలపై కార్మిక, రైతాంగ, ఉద్యోగ సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ నారాయణఖేడ్ రిపోర్టర్ అరుణ్, మానూర్ సీనియర్ రిపోర్టర్ సిద్ధి రాములు, హంగీర్గా కే సర్పంచ్ శాంత్ కుమార్, తోర్నాల సర్పంచ్ సంగమేష్, మున్సిపల్ టౌన్ కాంగ్రెస్ నాయకులు సచ్చితానంద ఆనంద్, తాహెర్ అలీ, విలేఖరి కృష్ణ, విట్టల్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News