Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:52 PM

ప్రజల సేవకే జీవితం అంకితం చేసిన మహానీయుడు ఉప్పల మల్సూర్

ప్రజల సేవకే జీవితం అంకితం చేసిన మహానీయుడు ఉప్పల మల్సూర్

ప్రజల సేవకే జీవితం అంకితం చేసిన మహానీయుడు ఉప్పల మల్సూర్
January 13, 2026 02:25 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్

సూర్యాపేట టౌన్, జనవరి :

ప్రజా ప్రతినిధిగా ప్రజల సేవలో తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ అని సూర్యాపేట పూర్వ విద్యార్థుల మిత్రమండలి గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్, అధ్యక్షుడు నల్లకుంట్ల అయోధ్య అన్నారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే ఉప్పల మల్సూర్ 27వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ… సూర్యాపేట నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికై, ప్రజలకు సేవ చేయడమే తన కర్తవ్యంగా నిస్వార్థంగా పనిచేశారని తెలిపారు.

నేటి సమాజంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయినా కోట్లు సంపాదించే పరిస్థితులు ఉన్నప్పటికీ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా కనీసం స్వంత ఇల్లు లేకుండా జీవితం సాగిస్తూ ప్రజల కోసం అంకితభావంతో పనిచేసిన వ్యక్తి ఉప్పల మల్సూర్ అని పేర్కొన్నారు. ఆయన జీవితం నేటి రాజకీయ నాయకులకు, యువతకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. జిల్లా కేంద్రంలోని నల్లాల బావి వద్ద ఉప్పల మల్సూర్ విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. బిన్ రెడ్డి, ధర్మబిక్షం, మల్లు స్వరాజ్యం, ఉప్పల మల్సూర్, నర్రా రాఘవరెడ్డి వంటి మహనీయుల జీవితాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి ప్రధాన కార్యదర్శి బయ్య మల్లికార్జున్, డేగల జనార్ధన్, నాతి సవేందర్, జిలకర చంద్రమౌళి, విద్యాసాగర్, సారగండ్ల మాణిక్యమ్మ, చిత్రం భద్రమ్మ, వీర్లపాటి వెంకన్న, షేక్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News