Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:21 PM

ప్రజల కోసం సేవ, దేశ కోసం ధైర్యం – ప్రియాంక గాంధీ వాద్రా స్ఫూర్తిదాయక జన్మదినం

ప్రజల కోసం సేవ, దేశ కోసం ధైర్యం – ప్రియాంక గాంధీ వాద్రా స్ఫూర్తిదాయక జన్మదినం

ప్రజల కోసం సేవ, దేశ కోసం ధైర్యం – ప్రియాంక గాంధీ వాద్రా స్ఫూర్తిదాయక జన్మదినం
January 12, 2026 06:53 PM 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ :జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా నాయకత్వంలో, మండల ముఖ్య మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లతో కలిసి శ్రీమతి ప్రియాంక గాంధీ వాద్రా జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.దేశ రాజకీయాల్లో ధైర్యవంతమైన నాయకత్వంతో, నిస్వార్థ సేవకు ప్రతీకగా నిలుస్తూ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం పోరాడుతున్న నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా. దేశ సమగ్రత కోసం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం ఆమె తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.ప్రత్యేకంగా పార్లమెంట్‌లో మహిళల హక్కుల కోసం, బలహీన వర్గాల సమస్యలపై ఆమె గట్టిగా ప్రశ్నిస్తూ ప్రజల గొంతుకగా నిలిచే తీరు ప్రశంసనీయం. మహిళలకు రాజకీయంగా ధైర్యం, ఆత్మవిశ్వాసం కలిగించే నాయకురాలిగా ఆమె సేవలు చిరస్మరణీయమైనవి.ఈ సందర్భంగా ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, మరింత ప్రజాసేవ చేస్తూ దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తున్నాము.ఈ కార్యక్రమంలో మండల ముఖ్య మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లు మమత (ఝరాసంగం), చంద్రకళ (కోహీర్), స్వరూప (న్యాల్కల్), మారుని బాయి (మొగుడంపల్లి), చన్నుబీ (జహీరాబాద్), సుజాత, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News