ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద స్వామి వివేకనంద 163వ జయంతి
ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద స్వామి వివేకనంద 163వ జయంతి
Sthanikam District Staff Reporter
స్వామి వివేకనంద విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎంపీ.బూర నర్సయ్య గౌడ్
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్
భారతీయ జనతా పార్టీ భువనగిరి పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద స్వామి వివేకనంద163వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత,దేశ ప్రతిష్టను విశ్వవ్యాపితం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద జయంతి రోజును దేశ యువత జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమని, ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి స్వామి వివేకానంద తన ఉపన్యాసాలతో ప్రపంచ వేదికలపై దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించి ప్రజలకు ఆదర్శప్రాయమైన వ్యక్తిగా నిలిచారని అన్నారు. అలాగే నారాయణపేట జిల్లా ధన్వాడ గ్రామం బిజెపి సర్పంచ్ గా గెలుపొందిన జ్యోతిని పట్టణ అధ్యక్షులు రత్నపురం బలరాం శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్,నర్ల నర్సింగరావు,సుర్వి శ్రీనివాస్,కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాయదశరథ, జిల్లా ప్రధాన కార్యదర్శి చంద మహేందర్ గుప్తా,చందుపట్ల వెంకటేశ్వర్ రావు,పన్నాల చంద్రశేఖర్ రెడ్డి,మంగు నరసింహారావు,ఆకుతోట రామకృష్ణ,పట్టణ ఉపాధ్యక్షులు కొల్లోజు సతీష్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాలబండి కృష్ణ చారి,దయ్యాల కుమారస్వామి,కొల్లిచెలిమ మల్లికార్జున్,పోతంశెట్టి భరత్,ఎదగాని సంతోష్,వాస నర్సింగ్,కారుపాటీ రాజు,మనీష్ దితరులు
పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి