Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:46 PM

పోయిన బంగారు బ్రాస్లెట్ కనిపెట్టి బాధితురాలికి అందజేసిన మచిలీపట్నం డి.ఎస్.పి క్రైమ్ పార్టీ సిబ్బంది

పోయిన బంగారు బ్రాస్లెట్ కనిపెట్టి బాధితురాలికి అందజేసిన మచిలీపట్నం డి.ఎస్.పి క్రైమ్ పార్టీ సిబ్బంది

పోయిన బంగారు బ్రాస్లెట్ కనిపెట్టి బాధితురాలికి అందజేసిన మచిలీపట్నం డి.ఎస్.పి క్రైమ్ పార్టీ సిబ్బంది
February 08, 2026 03:08 PM 116 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ ను అత్యంత తక్కువ సమయంలోనే మచిలీపట్నం డిఎస్పి క్రైమ్ పార్టీ సిబ్బంది సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి ఆ వస్తువు స్వాధీనం చేసుకుని చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ నబి చేతుల మీదుగా బాధితురాలకు అందచేసిన సంఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుందివివరాల్లోనికి వెళ్తేనర్సాపురానికి చెందిన ఆకుల లిఖిత అనే మహిళలు తన యొక్క మొక్కుబడి తీర్చుకునేందుకు నరసాపురం నుండి విజయవాడ బయల్దేరింది.ఆ క్రమంలో మచిలీపట్నం బస్టాండ్ లో దిగి విజయవాడ బస్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో తన చేతికి ఉన్న బ్రాస్లెట్ జారి పడిపోయింది. అది గమనించిన బాధితురాలు వెంటనే పోలీస్ వారికి ఫిర్యాదు చేయగా ఫిర్యాదు అందిన వెంటనే కేసును సీరియస్‌గా తీసుకుని, పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించి, పోయిన బంగారు బ్రాస్లెట్లను రికవరీ చేయడం జరిగింది.సుమారు 70 వేల రూపాయలు విలువగల పోయిందనుకున్న బంగారం తిరిగి లభించడంతో బాధితురాలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ, పోలీసు సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.ప్రజల భద్రతే లక్ష్యంగా, నేరాల నియంత్రణలో భాగంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, వేగవంతమైన దర్యాప్తుతో న్యాయం అందించడంలో కృష్ణాజిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News