PRINT TIME: May 26, 2026 06:53 PM
పోతనపల్లి గ్రామంలో ఘనంగా సంత్ సేవా లాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు
పోతనపల్లి గ్రామంలో ఘనంగా సంత్ సేవా లాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు
February 16, 2026 01:02 AM
210 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోతనపల్లి తండాలో గోర్ బంజారాల ముద్దు బిడ్డ, ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను గోర్ బంజారాలు భోగ్ బండారం మరియు కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంచి ఘనంగా చేశారు.ఈ సంధర్భంగా గోర్ బంజార సంఘము నాయకులు మాట్లాడుతూ గోర్ బోలి భాషను రాజ్యాంగం లోని 8వ షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాo తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు అదే విధంగా తండాలను ప్రత్యేక పంచాయతీలుగా గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘము నాయకులు పాంచాలు,బాలరాజు,మంగయ్య, పేరయ్య,నాగేశ్వరావు,రాంబాబు,మల్లికార్జునరావు, కృష్ణప్రసాద్, మురార్జి,శ్రీను,చెన్నారావు, పెద్ద వెంకటేశ్వరరావు,చలపతి, వెంకటరావు, ఎల్.నాగు మరియు గోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి