పోషకాహారం, పరిశుభ్రతపై రాజీ లేదు: జాతీయ మానవ హక్కుల కమిషన్
పోషకాహారం, పరిశుభ్రతపై రాజీ లేదు: జాతీయ మానవ హక్కుల కమిషన్
Krishna
జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పూర్తి స్థాయి వసతి సౌకర్యాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వసతి గృహాల్లోని మౌలిక వసతులు, బోధన ప్రమాణాలు, పరిశుభ్రత, భద్రత, భోజన నాణ్యత అన్నీ మెరుగ్గా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాత్రూములు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, శిధిలావస్థలో ఉన్న భవనాలను తక్షణమే మరమ్మతు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సమయానికి పౌష్టికాహారం అందుతున్నదీ, పర్యవేక్షణ సక్రమంగా జరుగుతున్నదీ పరిశీలించారు. అదేవిధంగా పోక్సో కేసులు, మానవ అక్రమ రవాణా నివారణ, నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులతో, భూ నిర్వహణ చట్టాల అమలు, మధ్యాహ్న భోజన బియ్యం సరఫరాపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. విద్యార్థులకు మెరుగైన వసతి, భద్రత, పోషకాహారం, నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డి.ఎస్.పి, ఆర్.డి.ఓ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి