Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రగతి దిశగా చౌటుప్పల్ మున్సిపాలిటీ: రెండవ కౌన్సిల్ తొలి సమావేశం ఘన విజయం స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 10:08 PM

పోషకాహారం, పరిశుభ్రతపై రాజీ లేదు: జాతీయ మానవ హక్కుల కమిషన్

పోషకాహారం, పరిశుభ్రతపై రాజీ లేదు: జాతీయ మానవ హక్కుల కమిషన్

పోషకాహారం, పరిశుభ్రతపై రాజీ లేదు: జాతీయ మానవ హక్కుల కమిషన్
March 25, 2026 08:27 PM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పూర్తి స్థాయి వసతి సౌకర్యాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వసతి గృహాల్లోని మౌలిక వసతులు, బోధన ప్రమాణాలు, పరిశుభ్రత, భద్రత, భోజన నాణ్యత అన్నీ మెరుగ్గా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాత్రూములు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, శిధిలావస్థలో ఉన్న భవనాలను తక్షణమే మరమ్మతు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సమయానికి పౌష్టికాహారం అందుతున్నదీ, పర్యవేక్షణ సక్రమంగా జరుగుతున్నదీ పరిశీలించారు. అదేవిధంగా పోక్సో కేసులు, మానవ అక్రమ రవాణా నివారణ, నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులతో, భూ నిర్వహణ చట్టాల అమలు, మధ్యాహ్న భోజన బియ్యం సరఫరాపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. విద్యార్థులకు మెరుగైన వసతి, భద్రత, పోషకాహారం, నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డి.ఎస్.పి, ఆర్.డి.ఓ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News