Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

పోషకాహారం, పరిశుభ్రతపై రాజీ లేదు: జాతీయ మానవ హక్కుల కమిషన్

పోషకాహారం, పరిశుభ్రతపై రాజీ లేదు: జాతీయ మానవ హక్కుల కమిషన్

పోషకాహారం, పరిశుభ్రతపై రాజీ లేదు: జాతీయ మానవ హక్కుల కమిషన్
March 25, 2026 08:27 PM 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పూర్తి స్థాయి వసతి సౌకర్యాలు అందేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వసతి గృహాల్లోని మౌలిక వసతులు, బోధన ప్రమాణాలు, పరిశుభ్రత, భద్రత, భోజన నాణ్యత అన్నీ మెరుగ్గా ఉండాలని ఆమె స్పష్టం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బాత్రూములు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, శిధిలావస్థలో ఉన్న భవనాలను తక్షణమే మరమ్మతు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సమయానికి పౌష్టికాహారం అందుతున్నదీ, పర్యవేక్షణ సక్రమంగా జరుగుతున్నదీ పరిశీలించారు. అదేవిధంగా పోక్సో కేసులు, మానవ అక్రమ రవాణా నివారణ, నేరాల నియంత్రణపై పోలీస్ అధికారులతో, భూ నిర్వహణ చట్టాల అమలు, మధ్యాహ్న భోజన బియ్యం సరఫరాపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. విద్యార్థులకు మెరుగైన వసతి, భద్రత, పోషకాహారం, నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో డి.ఎస్.పి, ఆర్.డి.ఓ, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News