Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 10:23 PM

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై కలెక్టర్ నేర పరిశీలన ఆలేరు–యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో తనిఖీలు.

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై కలెక్టర్ నేర పరిశీలన ఆలేరు–యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో తనిఖీలు.

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియపై కలెక్టర్ నేర పరిశీలన ఆలేరు–యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో తనిఖీలు.
February 09, 2026 05:20 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

సోమవారం ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాలను ఆయన సందర్శించారు.

పోస్టల్ బ్యాలెట్ వినియోగించిన ఉద్యోగుల సంఖ్యపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్డుల వారీగా బ్యాలెట్ పత్రాల పంపిణీ సక్రమంగా జరిగిందా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సదుపాయాలు, వసతులను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ సోమవారం సాయంత్రం నాటికి పూర్తవుతుందని అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. అనంతరం సేకరించిన పోస్టల్ బ్యాలెట్లను కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News