Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:57 PM

పొరుగు రాష్ట్రాల వారిపై చర్యలు తీసుకోవాలి: కౌన్సిలర్ బత్తుల వాణి

పొరుగు రాష్ట్రాల వారిపై చర్యలు తీసుకోవాలి: కౌన్సిలర్ బత్తుల వాణి

పొరుగు రాష్ట్రాల వారిపై చర్యలు తీసుకోవాలి: కౌన్సిలర్ బత్తుల వాణి
March 29, 2026 11:04 AM 129 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పద్మశాలి కాలనీలో పొరుగు రాష్ట్రాల వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్ శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాలనీలో పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాల వారు కిరాయి ఇళ్లలో నివసిస్తున్నారని తెలిపారు. వారిలో కొందరు మాదకద్రవ్యాలకు అలవాటు పడి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.

కిరాయి ఇళ్ల యజమానులను పిలిపించి అటువంటి వ్యక్తులను వెంటనే కాలనీ నుంచి ఖాళీ చేయించాలని కమిషనర్‌ను కోరారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమం లో కౌన్సిలర్‌ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News