పొరుగు రాష్ట్రాల వారిపై చర్యలు తీసుకోవాలి: కౌన్సిలర్ బత్తుల వాణి
పొరుగు రాష్ట్రాల వారిపై చర్యలు తీసుకోవాలి: కౌన్సిలర్ బత్తుల వాణి
K.RAVI
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పద్మశాలి కాలనీలో పొరుగు రాష్ట్రాల వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్ శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాలనీలో పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాల వారు కిరాయి ఇళ్లలో నివసిస్తున్నారని తెలిపారు. వారిలో కొందరు మాదకద్రవ్యాలకు అలవాటు పడి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.
కిరాయి ఇళ్ల యజమానులను పిలిపించి అటువంటి వ్యక్తులను వెంటనే కాలనీ నుంచి ఖాళీ చేయించాలని కమిషనర్ను కోరారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమం లో కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి