Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:11 AM

పొరుగు రాష్ట్రాల వారిపై చర్యలు తీసుకోవాలి: కౌన్సిలర్ బత్తుల వాణి

పొరుగు రాష్ట్రాల వారిపై చర్యలు తీసుకోవాలి: కౌన్సిలర్ బత్తుల వాణి

పొరుగు రాష్ట్రాల వారిపై చర్యలు తీసుకోవాలి: కౌన్సిలర్ బత్తుల వాణి
29-03-2026 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పద్మశాలి కాలనీలో పొరుగు రాష్ట్రాల వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్ శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాలనీలో పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాల వారు కిరాయి ఇళ్లలో నివసిస్తున్నారని తెలిపారు. వారిలో కొందరు మాదకద్రవ్యాలకు అలవాటు పడి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.

కిరాయి ఇళ్ల యజమానులను పిలిపించి అటువంటి వ్యక్తులను వెంటనే కాలనీ నుంచి ఖాళీ చేయించాలని కమిషనర్‌ను కోరారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమం లో కౌన్సిలర్‌ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.

Sthanikam

పొరుగు రాష్ట్రాల వారిపై చర్యలు తీసుకోవాలి: కౌన్సిలర్ బత్తుల వాణి

Article Image

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పద్మశాలి కాలనీలో పొరుగు రాష్ట్రాల వారి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ గౌడ్ శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాలనీలో పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న పొరుగు రాష్ట్రాల వారు కిరాయి ఇళ్లలో నివసిస్తున్నారని తెలిపారు. వారిలో కొందరు మాదకద్రవ్యాలకు అలవాటు పడి స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు.

కిరాయి ఇళ్ల యజమానులను పిలిపించి అటువంటి వ్యక్తులను వెంటనే కాలనీ నుంచి ఖాళీ చేయించాలని కమిషనర్‌ను కోరారు. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమం లో కౌన్సిలర్‌ బత్తుల వాణి విప్లవ్ గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News