Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:08 PM

పోలీస్ సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలి

పోలీస్ సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలి

పోలీస్ సిబ్బంది అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలి
February 11, 2026 09:49 AM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

చౌటుప్పల్ ఏసీపీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా,నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ సిబ్బంది పూర్తి అప్రమత్తతో పనిచేయాలని చౌటుప్పల్ ఏసిపి పటోళ్ల మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు.మంగళవారం చౌటుప్పల్ పట్టణంలోని సాన్ జాన్ పాఠశాలలో ఏర్పాటుచేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోలీస్ అధికారుల, సిబ్బంది సమావేశంలో ఏసీపీ పాల్గొని మున్సిపల్ ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణలో పోలీస్ సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని పేర్కొంటూ, ప్రతి అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో చట్టవ్యవస్థ పరిరక్షణే ప్రధాన లక్ష్యమని ఏసీపీ తెలిపారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని, ఉల్లంఘించిన వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా సాగేలా పోలీస్ శాఖ నిరంతర పర్యవేక్షణ చేపడుతుందన్నారు.పోలింగ్ కు ముందు, పోలింగ్ రోజున సున్నిత ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద అనుమానాస్పద వ్యక్తులు, గుంపులపై కఠిన నిఘా పెట్టాలని, అక్రమ మద్యం, నగదు, ఇతర ప్రలోభాలకు సంబంధించిన చర్యలను అడ్డుకునేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలన్నారు. పోలింగ్ సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.ప్రజలతోమర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తూ వారిలో విశ్వాసం కలిగించే విధంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఎలాంటి చిన్న సంఘటన జరిగినా ఆలస్యం చేయకుండా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని ఏసీపీ భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపారు. సమావేశంలో సిఐ మన్మధ కుమార్, ట్రాఫిక్ సీఐ విజయ్ మోహన్, ఎస్ఐ యాదగిరి, ఎస్సై అజయ్ భార్గవ్, ఎస్పై ఉపేందర్ రెడ్డి, ఎఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News