పోలవరంలో టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి
పోలవరంలో టీడీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయ జనవరి 18(స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు మరిడి వెంకటేశ్వరరావు, పోలవరం వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ యర్రా ప్రసాద రావు ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ ఒక యుగపురుషుడని,అనే సంక్షేమ పథకాలు అనేక సంస్కరణల ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, రైతులకు విద్యుత్ విషయంలో గానీ మహిళలకు పురుషులతో పాటు సమాన ఆస్తి హక్కు విషయంలో గానీ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యం గానీ రెవెన్యూ లో మునసబు కర్ణాల విషయంలో గానీ ఎన్నో ఎన్నెన్నో ఇటువంటి వాటి ద్వారా ప్రజల కోసం నిరంతరం పాటుపడి రాజ్య పాలన చేసిన నాయకుడని కొనియాడారు ఈకార్యక్రమంలో తమ్మిలేరు రిజర్వాయర్ నీటి సంఘం అధ్యక్షులు యర్రా రమేష్ టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు బిలుగుది జయరాజు, టీడీపీ సీనియర్ నాయకులు పర్వతనేని సీతారామయ్య, జనసేన నాయకులు పసుపులేటి నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్ ఈదర సత్యనారాయణ రాజు, మాజీ ఉప సర్పంచ్ గడ్డం కొండయ్య తదితర నాయక కార్యకర్తలు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి