Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:58 PM

పోలవరం గ్రామంలో వరి, ఈపంట (e crop) పై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఏవో బి శివశంకర్

పోలవరం గ్రామంలో వరి, ఈపంట (e crop) పై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఏవో బి శివశంకర్

పోలవరం గ్రామంలో వరి, ఈపంట (e crop) పై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఏవో బి శివశంకర్
January 28, 2026 05:29 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 28(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వరి పంట సాగు మరియు ఈ పంట పై క్షేత్రస్థాయి సందర్శన చేసిన ఏవో బి శివ శంకర్ మాట్లాడుతూ మొక్కజొన్న, వరి పండించే రైతులు పొలం పరిసరాలు కచ్చితంగా విశ్లేషణ చేసుకోవాలని, వరి పంటతో పుట్టుకొచ్చే కలుపు మొక్కలు వెలుతురు, నీరు, పోషకాలు కోసం పంట మొక్కలతో పోటీ పడతాయని, ఒక్కోసారి కలుపు వలన రైతు పండించే పంటలకు చీడపీడలు తెగుళ్లు సంక్రమిస్తాయని, వీటిని నియంత్రించేందుకు అనేక మిత్ర పురుగులు కూడా ఉంటాయని, ఈ మిత్ర పురుగులు వివిధ దశలలో గుడ్లు, పిల్ల పురుగులు, రెక్కల పురుగులపై దాడి చేసి వాటిని నాశనం చేస్తాయని. కావున మిత్ర పురుగులను రైతులు అధికంగా రసాయన,పురుగు మందులు ఎరువులు వాడకుండా కాపాడుకోవాలని కందిరీగలు గుడ్లను, కోశస్త దశలులను చంపుతాయని, తూనీగలు, నీటినల్లి, సాలె పురుగులు సుడిదోమను చంపుతాయని, కోక కోలా పురుగు, బ్రాకాన్ కందిరీగ, ఆకు ముడత పురుగును తింటాయని, తూనీగ, సాలెపురుగు పచ్చదీపపు పురుగును అరికడతాయని, కావున రైతులు మిత్ర పురుగులను సంరక్షించుకొని ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపించాలని, పక్షి స్థావరాలు, కాలిబాటలు ఖచ్చితంగా రైతులు పాటించాలని తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News