Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:22 AM

పోలవరం గ్రామంలో వరి, ఈపంట (e crop) పై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఏవో బి శివశంకర్

పోలవరం గ్రామంలో వరి, ఈపంట (e crop) పై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఏవో బి శివశంకర్

పోలవరం గ్రామంలో వరి, ఈపంట (e crop) పై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఏవో బి శివశంకర్
January 28, 2026 05:29 PM 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 28(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వరి పంట సాగు మరియు ఈ పంట పై క్షేత్రస్థాయి సందర్శన చేసిన ఏవో బి శివ శంకర్ మాట్లాడుతూ మొక్కజొన్న, వరి పండించే రైతులు పొలం పరిసరాలు కచ్చితంగా విశ్లేషణ చేసుకోవాలని, వరి పంటతో పుట్టుకొచ్చే కలుపు మొక్కలు వెలుతురు, నీరు, పోషకాలు కోసం పంట మొక్కలతో పోటీ పడతాయని, ఒక్కోసారి కలుపు వలన రైతు పండించే పంటలకు చీడపీడలు తెగుళ్లు సంక్రమిస్తాయని, వీటిని నియంత్రించేందుకు అనేక మిత్ర పురుగులు కూడా ఉంటాయని, ఈ మిత్ర పురుగులు వివిధ దశలలో గుడ్లు, పిల్ల పురుగులు, రెక్కల పురుగులపై దాడి చేసి వాటిని నాశనం చేస్తాయని. కావున మిత్ర పురుగులను రైతులు అధికంగా రసాయన,పురుగు మందులు ఎరువులు వాడకుండా కాపాడుకోవాలని కందిరీగలు గుడ్లను, కోశస్త దశలులను చంపుతాయని, తూనీగలు, నీటినల్లి, సాలె పురుగులు సుడిదోమను చంపుతాయని, కోక కోలా పురుగు, బ్రాకాన్ కందిరీగ, ఆకు ముడత పురుగును తింటాయని, తూనీగ, సాలెపురుగు పచ్చదీపపు పురుగును అరికడతాయని, కావున రైతులు మిత్ర పురుగులను సంరక్షించుకొని ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపించాలని, పక్షి స్థావరాలు, కాలిబాటలు ఖచ్చితంగా రైతులు పాటించాలని తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News