పోలవరం గ్రామంలో వరి, ఈపంట (e crop) పై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఏవో బి శివశంకర్
పోలవరం గ్రామంలో వరి, ఈపంట (e crop) పై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఏవో బి శివశంకర్
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 28(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వరి పంట సాగు మరియు ఈ పంట పై క్షేత్రస్థాయి సందర్శన చేసిన ఏవో బి శివ శంకర్ మాట్లాడుతూ మొక్కజొన్న, వరి పండించే రైతులు పొలం పరిసరాలు కచ్చితంగా విశ్లేషణ చేసుకోవాలని, వరి పంటతో పుట్టుకొచ్చే కలుపు మొక్కలు వెలుతురు, నీరు, పోషకాలు కోసం పంట మొక్కలతో పోటీ పడతాయని, ఒక్కోసారి కలుపు వలన రైతు పండించే పంటలకు చీడపీడలు తెగుళ్లు సంక్రమిస్తాయని, వీటిని నియంత్రించేందుకు అనేక మిత్ర పురుగులు కూడా ఉంటాయని, ఈ మిత్ర పురుగులు వివిధ దశలలో గుడ్లు, పిల్ల పురుగులు, రెక్కల పురుగులపై దాడి చేసి వాటిని నాశనం చేస్తాయని. కావున మిత్ర పురుగులను రైతులు అధికంగా రసాయన,పురుగు మందులు ఎరువులు వాడకుండా కాపాడుకోవాలని కందిరీగలు గుడ్లను, కోశస్త దశలులను చంపుతాయని, తూనీగలు, నీటినల్లి, సాలె పురుగులు సుడిదోమను చంపుతాయని, కోక కోలా పురుగు, బ్రాకాన్ కందిరీగ, ఆకు ముడత పురుగును తింటాయని, తూనీగ, సాలెపురుగు పచ్చదీపపు పురుగును అరికడతాయని, కావున రైతులు మిత్ర పురుగులను సంరక్షించుకొని ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపించాలని, పక్షి స్థావరాలు, కాలిబాటలు ఖచ్చితంగా రైతులు పాటించాలని తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి