Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:18 PM

పోలవరం గ్రామంలో వరి, ఈపంట (e crop) పై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఏవో బి శివశంకర్

పోలవరం గ్రామంలో వరి, ఈపంట (e crop) పై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఏవో బి శివశంకర్

పోలవరం గ్రామంలో వరి, ఈపంట (e crop) పై క్షేత్రస్థాయి పరిశీలన చేసిన ఏవో బి శివశంకర్
January 28, 2026 05:29 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 28(స్ధానికం ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వరి పంట సాగు మరియు ఈ పంట పై క్షేత్రస్థాయి సందర్శన చేసిన ఏవో బి శివ శంకర్ మాట్లాడుతూ మొక్కజొన్న, వరి పండించే రైతులు పొలం పరిసరాలు కచ్చితంగా విశ్లేషణ చేసుకోవాలని, వరి పంటతో పుట్టుకొచ్చే కలుపు మొక్కలు వెలుతురు, నీరు, పోషకాలు కోసం పంట మొక్కలతో పోటీ పడతాయని, ఒక్కోసారి కలుపు వలన రైతు పండించే పంటలకు చీడపీడలు తెగుళ్లు సంక్రమిస్తాయని, వీటిని నియంత్రించేందుకు అనేక మిత్ర పురుగులు కూడా ఉంటాయని, ఈ మిత్ర పురుగులు వివిధ దశలలో గుడ్లు, పిల్ల పురుగులు, రెక్కల పురుగులపై దాడి చేసి వాటిని నాశనం చేస్తాయని. కావున మిత్ర పురుగులను రైతులు అధికంగా రసాయన,పురుగు మందులు ఎరువులు వాడకుండా కాపాడుకోవాలని కందిరీగలు గుడ్లను, కోశస్త దశలులను చంపుతాయని, తూనీగలు, నీటినల్లి, సాలె పురుగులు సుడిదోమను చంపుతాయని, కోక కోలా పురుగు, బ్రాకాన్ కందిరీగ, ఆకు ముడత పురుగును తింటాయని, తూనీగ, సాలెపురుగు పచ్చదీపపు పురుగును అరికడతాయని, కావున రైతులు మిత్ర పురుగులను సంరక్షించుకొని ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపించాలని, పక్షి స్థావరాలు, కాలిబాటలు ఖచ్చితంగా రైతులు పాటించాలని తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News