Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:07 AM

పంతంగిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు లైన్లను మార్చాలని అధికారులకు వినతి

పంతంగిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు లైన్లను మార్చాలని అధికారులకు వినతి

పంతంగిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు లైన్లను మార్చాలని అధికారులకు వినతి
January 21, 2026 09:59 AM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో వ్యవసాయ విద్యుత్ లైన్లు ప్రజల నివాసాల మధ్యగా, ఇళ్ల పక్కల నుంచి వెళ్లడం వల్ల తీవ్ర ప్రమాద పరిస్థితులు నెలకొన్నాయని గ్రామ ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు తగిన రక్షణ లేకుండా ప్రమాదకర స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పంతంగి గ్రామ ఉపసర్పంచ్ బోయ సదానందం, వార్డు సభ్యులు సప్పిడి లింగారెడ్డి, బండ శేఖర్, బొమ్మని రాజశేఖర్, గ్రామ నాయకులు బోయ కిరణ్, అంతటి నరేష్ తదితరులు చౌటుప్పల్ ఏడి, ఏఈ అధికారులకు వినతి పత్రం అందజేశారు.గ్రామంలో అవసరమైన చోట్ల కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, శిధిలావస్థలో ఉన్న స్తంభాలను వెంటనే తొలగించాలని, ఇళ్ల మధ్యగా వెళ్లే వ్యవసాయ విద్యుత్ వైర్లను సరిచేసి సురక్షితంగా మార్చాలని వారు కోరారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పటిష్టమైన రక్షణ ఏర్పాటు చేసి, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.గ్రామంలో చిన్నపిల్లలు, వృద్ధులు నివసిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అపశృతి జరగకుండా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు కోరారు. అధికారుల స్పందనపై గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News