పంతంగిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు లైన్లను మార్చాలని అధికారులకు వినతి
పంతంగిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు లైన్లను మార్చాలని అధికారులకు వినతి
Komidala Mahender reddy
స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో వ్యవసాయ విద్యుత్ లైన్లు ప్రజల నివాసాల మధ్యగా, ఇళ్ల పక్కల నుంచి వెళ్లడం వల్ల తీవ్ర ప్రమాద పరిస్థితులు నెలకొన్నాయని గ్రామ ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు తగిన రక్షణ లేకుండా ప్రమాదకర స్థితిలో ఉన్నాయని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో పంతంగి గ్రామ ఉపసర్పంచ్ బోయ సదానందం, వార్డు సభ్యులు సప్పిడి లింగారెడ్డి, బండ శేఖర్, బొమ్మని రాజశేఖర్, గ్రామ నాయకులు బోయ కిరణ్, అంతటి నరేష్ తదితరులు చౌటుప్పల్ ఏడి, ఏఈ అధికారులకు వినతి పత్రం అందజేశారు.గ్రామంలో అవసరమైన చోట్ల కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని, శిధిలావస్థలో ఉన్న స్తంభాలను వెంటనే తొలగించాలని, ఇళ్ల మధ్యగా వెళ్లే వ్యవసాయ విద్యుత్ వైర్లను సరిచేసి సురక్షితంగా మార్చాలని వారు కోరారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పటిష్టమైన రక్షణ ఏర్పాటు చేసి, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.గ్రామంలో చిన్నపిల్లలు, వృద్ధులు నివసిస్తున్న నేపథ్యంలో ఎలాంటి అపశృతి జరగకుండా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు కోరారు. అధికారుల స్పందనపై గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి