Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:46 AM

పండ్ల బుట్ట గుర్తుకే ప్రజల తీర్పు

పండ్ల బుట్ట గుర్తుకే ప్రజల తీర్పు

పండ్ల బుట్ట గుర్తుకే ప్రజల తీర్పు
February 06, 2026 01:25 PM 134 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

11వ వార్డులో ఏకమవుతున్న ప్రజలు

11వ వార్డులో పండ్ల బుట్ట గుర్తుతో బరిలో నిలిచిన బిఆర్ఎస్, సిపిఎం, బలపరిచిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకుడు ప్రజలను కోరారు. వార్డు పరిధిలో నిర్వహించిన ఇంటింటి ప్రచారం, సమావేశాల్లో ఆయన మాట్లాడారు.పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ అభ్యర్థి ముందుకు వచ్చారని తెలిపారు. గతంలో ఎన్నో హామీలు ఇచ్చినా అభివృద్ధి జరగలేదని, మౌలిక సదుపాయాల లోపంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి సమస్యలు సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు.

ఈ పరిస్థితుల్లో నిజాయితీగా పనిచేసే, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. అందుకే బిఆర్ఎస్, సిపిఎం, కాంగ్రెస్ రెబల్ కలిసి పండ్ల బుట్ట గుర్తుతో ఉన్న అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నట్లు వెల్లడించారు. ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే సామర్థ్యం ఈ అభ్యర్థికే ఉందని చెప్పారు.వార్డు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని, ప్రతి వీధి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అభ్యర్థి హామీ ఇచ్చారు. ప్రజల విశ్వాసం, ఆశీర్వాదంతో విజయం సాధించి, వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల్లో పండ్ల బుట్ట గుర్తుకు ఓటు వేసి, ప్రజా పాలనకు బలమైన మద్దతు ఇవ్వాలని నాయకులు ప్రజలను కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News