Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:14 PM

పంచాయతీ కార్యదర్శులతో కీలక సమావేశం:ఇంటి పన్నుల వసూళ్లకు ఆదేశాలు

పంచాయతీ కార్యదర్శులతో కీలక సమావేశం:ఇంటి పన్నుల వసూళ్లకు ఆదేశాలు

పంచాయతీ కార్యదర్శులతో కీలక సమావేశం:ఇంటి పన్నుల వసూళ్లకు ఆదేశాలు
February 05, 2026 09:15 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో జీపీఓబీడీ టీం లీడర్,తహశీల్దార్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రామాల వారీగా ఇంటి పన్నుల వసూళ్ల పురోగతిపై సమీక్ష చేపట్టారు.ఇంటి పన్నులు,ఇతర స్థానిక పన్నుల వసూళ్లను వేగవంతం చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని అధికారులకు సూచించారు.పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో చేర్చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.గ్రామ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని,ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని సూచించారు.ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News