పంచాయతీ కార్యదర్శులతో కీలక సమావేశం:ఇంటి పన్నుల వసూళ్లకు ఆదేశాలు
పంచాయతీ కార్యదర్శులతో కీలక సమావేశం:ఇంటి పన్నుల వసూళ్లకు ఆదేశాలు
Reporter Sangameshwar Reddy
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో జీపీఓబీడీ టీం లీడర్,తహశీల్దార్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రామాల వారీగా ఇంటి పన్నుల వసూళ్ల పురోగతిపై సమీక్ష చేపట్టారు.ఇంటి పన్నులు,ఇతర స్థానిక పన్నుల వసూళ్లను వేగవంతం చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని అధికారులకు సూచించారు.పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో చేర్చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.గ్రామ స్థాయిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని,ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని సూచించారు.ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి