Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:47 PM

పంచాయతీ కార్యదర్శులతో కీలక సమావేశం:ఇంటి పన్నుల వసూళ్లకు ఆదేశాలు

పంచాయతీ కార్యదర్శులతో కీలక సమావేశం:ఇంటి పన్నుల వసూళ్లకు ఆదేశాలు

పంచాయతీ కార్యదర్శులతో కీలక సమావేశం:ఇంటి పన్నుల వసూళ్లకు ఆదేశాలు
February 05, 2026 09:15 PM 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులతో జీపీఓబీడీ టీం లీడర్,తహశీల్దార్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో గ్రామాల వారీగా ఇంటి పన్నుల వసూళ్ల పురోగతిపై సమీక్ష చేపట్టారు.ఇంటి పన్నులు,ఇతర స్థానిక పన్నుల వసూళ్లను వేగవంతం చేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని అధికారులకు సూచించారు.పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.అదేవిధంగా ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు జాబితాలో చేర్చేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.గ్రామ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని,ప్రజలకు ప్రభుత్వ సేవలు అందడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని సూచించారు.ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు,పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News