Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:02 AM

పంతంగి గ్రామానికి ఆర్టీసీ బస్సు పునఃప్రారంభం కోరుతూ వినతి

పంతంగి గ్రామానికి ఆర్టీసీ బస్సు పునఃప్రారంభం కోరుతూ వినతి

పంతంగి గ్రామానికి ఆర్టీసీ బస్సు పునఃప్రారంభం కోరుతూ వినతి
07-04-2026 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రీజినల్ మేనేజర్‌కు గ్రామ ప్రజల విజ్ఞప్తి

చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునఃప్రారంభించాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ మేరకు నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు వినతి పత్రం సమర్పించారు.గ్రామ ప్రతినిధులు తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా దిల్‌సుఖ్‌నగర్ నుండి పంతంగి గ్రామానికి నడిచే 555 నంబర్ బస్సు సేవలు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ బస్సు ద్వారా ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు సులభంగా రాకపోకలు సాగించేవారని తెలిపారు.

అయితే ఇటీవల ఈ బస్సు సేవలను నిలిపివేయడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యార్థం 555 బస్సు సర్వీసును వెంటనే పునఃప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సదానందం, వార్డు సభ్యులు సప్పిడి లింగారెడ్డి, గుండెపురం ప్రతిభ నరేష్, గాడిదల శ్వేత ప్రవీణ్, బండ శేఖర్, బొమ్మని రాజశేఖర్, బాతరాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పంతంగి గ్రామానికి ఆర్టీసీ బస్సు పునఃప్రారంభం కోరుతూ వినతి

Article Image

రీజినల్ మేనేజర్‌కు గ్రామ ప్రజల విజ్ఞప్తి

చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునఃప్రారంభించాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ మేరకు నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌కు వినతి పత్రం సమర్పించారు.గ్రామ ప్రతినిధులు తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా దిల్‌సుఖ్‌నగర్ నుండి పంతంగి గ్రామానికి నడిచే 555 నంబర్ బస్సు సేవలు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ బస్సు ద్వారా ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు సులభంగా రాకపోకలు సాగించేవారని తెలిపారు.

అయితే ఇటీవల ఈ బస్సు సేవలను నిలిపివేయడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యార్థం 555 బస్సు సర్వీసును వెంటనే పునఃప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సదానందం, వార్డు సభ్యులు సప్పిడి లింగారెడ్డి, గుండెపురం ప్రతిభ నరేష్, గాడిదల శ్వేత ప్రవీణ్, బండ శేఖర్, బొమ్మని రాజశేఖర్, బాతరాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News