పంతంగి గ్రామానికి ఆర్టీసీ బస్సు పునఃప్రారంభం కోరుతూ వినతి
పంతంగి గ్రామానికి ఆర్టీసీ బస్సు పునఃప్రారంభం కోరుతూ వినతి
K.RAVI
రీజినల్ మేనేజర్కు గ్రామ ప్రజల విజ్ఞప్తి
చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసును పునఃప్రారంభించాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ మేరకు నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్కు వినతి పత్రం సమర్పించారు.గ్రామ ప్రతినిధులు తెలిపారు గత కొన్ని సంవత్సరాలుగా దిల్సుఖ్నగర్ నుండి పంతంగి గ్రామానికి నడిచే 555 నంబర్ బస్సు సేవలు గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ బస్సు ద్వారా ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాలకు సులభంగా రాకపోకలు సాగించేవారని తెలిపారు.
అయితే ఇటీవల ఈ బస్సు సేవలను నిలిపివేయడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సౌకర్యార్థం 555 బస్సు సర్వీసును వెంటనే పునఃప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సదానందం, వార్డు సభ్యులు సప్పిడి లింగారెడ్డి, గుండెపురం ప్రతిభ నరేష్, గాడిదల శ్వేత ప్రవీణ్, బండ శేఖర్, బొమ్మని రాజశేఖర్, బాతరాజు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి