పంతంగి చెక్పోస్ట్ వద్ద పశువుల అక్రమ రవాణా పట్టివేత
పంతంగి చెక్పోస్ట్ వద్ద పశువుల అక్రమ రవాణా పట్టివేత
K.RAVI
పంతంగి చెక్పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 23 పశువులను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. తేదీ 11-05-2026న ఎస్హెచ్ఓ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ఏ. నరేష్ (HC 2314), ఏఆర్పీసీ 7967 సీతారాం రెడ్డి పెట్రోమొబైల్-01లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు 06-05-2026న ఉదయం 4.30 గంటల సమయంలో పంతంగి చెక్పోస్ట్ వద్ద పీసీ 4618 శ్రీనుతో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు.తనిఖీల్లో భాగంగా TS12UD 6308 నంబర్ గల డీసీఎం వాహనాన్ని ఆపి పరిశీలించగా అందులో 10 ఆవులు, 4 ఎద్దులు, 4 మగ దూడలు, 5 ఆడ దూడలు మొత్తం 23 పశువులు ఉన్నట్లు గుర్తించారు.వాహన డ్రైవర్ను విచారించగా అతను రమావత్ శరత్కుమార్ (25), తండ్రి మృతుడు శంకర్, చెన్నారెడ్డిగూడెం, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా వాసి అని తెలిపాడు. దాసరి వీరబాబు ఆదేశాల మేరకు జగ్గంపేట సంతలో పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు వెల్లడించాడు. డీసీఎం వాహన యజమాని పత్లావత్ రాజు, తండ్రి సుకియా, నాంపల్లి, హైదరాబాద్కు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చౌటుప్పల్ సీఐ జి. మన్మధ్ కుమార్ తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి