Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:06 PM

పంతంగి చెక్‌పోస్ట్ వద్ద పశువుల అక్రమ రవాణా పట్టివేత

పంతంగి చెక్‌పోస్ట్ వద్ద పశువుల అక్రమ రవాణా పట్టివేత

పంతంగి చెక్‌పోస్ట్ వద్ద పశువుల అక్రమ రవాణా పట్టివేత
May 12, 2026 05:33 PM 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పంతంగి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 23 పశువులను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. తేదీ 11-05-2026న ఎస్‌హెచ్‌ఓ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ ఏ. నరేష్ (HC 2314), ఏఆర్‌పీసీ 7967 సీతారాం రెడ్డి పెట్రోమొబైల్-01లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు 06-05-2026న ఉదయం 4.30 గంటల సమయంలో పంతంగి చెక్‌పోస్ట్ వద్ద పీసీ 4618 శ్రీనుతో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు.తనిఖీల్లో భాగంగా TS12UD 6308 నంబర్ గల డీసీఎం వాహనాన్ని ఆపి పరిశీలించగా అందులో 10 ఆవులు, 4 ఎద్దులు, 4 మగ దూడలు, 5 ఆడ దూడలు మొత్తం 23 పశువులు ఉన్నట్లు గుర్తించారు.వాహన డ్రైవర్‌ను విచారించగా అతను రమావత్ శరత్‌కుమార్ (25), తండ్రి మృతుడు శంకర్, చెన్నారెడ్డిగూడెం, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా వాసి అని తెలిపాడు. దాసరి వీరబాబు ఆదేశాల మేరకు జగ్గంపేట సంతలో పశువులను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించాడు. డీసీఎం వాహన యజమాని పత్లావత్ రాజు, తండ్రి సుకియా, నాంపల్లి, హైదరాబాద్‌కు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చౌటుప్పల్ సీఐ జి. మన్మధ్ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News