శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి స్వర్ణ గ్రామ సచివాలయం సమీపంలో ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని స్థానిక నాయకులు చలివేంద్రం ఏర్పాటు చేశారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ చర్య చేపట్టారు.
ఈ చలివేంద్రం ద్వారా గ్రామస్తులు, ప్రయాణికులు దాహార్తి తీర్చుకుంటూ ఉపశమనం పొందుతున్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, కూటమి నాయకులు, స్వర్ణ గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగించాలని పలువురు అభిప్రాయపడ్డారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి