పిట్టంపల్లి లొ ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
పిట్టంపల్లి లొ ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
Komidala Mahender reddy
తెలంగాణ ప్రజా కవి, విప్లవ గాయకుడు గద్దర్ జయంతిని పురస్కరించుకుని చిట్యాల మండలం పిట్టంపల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
నకిరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏనుగు రఘుమా రెడ్డి నేతృత్వంలో గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గద్దర్ ప్రజా ఉద్యమాలు, సామాజిక సేవలు స్మరించుకుంటూ ఆయన ఆశయాలు, భావజాలాన్ని కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.
అనంతరం గద్దర్ కి ఘన నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని గద్దర్ ఆశయాలను ప్రతిబింబించే నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో పిట్టంపల్లి గ్రామ సర్పంచ్ అందే అండాలు రాములు యాదవ్, బొంగోని చెరువు గ్రామ సర్పంచ్ కట్ట ఆశయ్య, వెలిమినేడు గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు సుర్కంటి సత్తిరెడ్డి, పిట్టంపల్లి ఉప సర్పంచ్ నారగోని నాగరాజు యాదవ్, వెలిమినేడు వార్డు సభ్యులు మంకాల లింగస్వామి, దేశబోయిన మంజుల మల్లేష్, మాజీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
అలాగే యువజన కాంగ్రెస్ నాయకులు ఏనుగు పద్మా రెడ్డి, వట్టిపల్లి యాదులు, ఎండీ ఖాజా పాషా, సుర్కంటి నర్సిరెడ్డి, అందే చందు యాదవ్, గోలి నరేష్, జక్కలి రాజు, మేడి విష్ణు, మేడబోయిన సురేష్, చిన్నం వెంకటేష్, అందే బన్నీ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి