Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 04:19 AM

పిట్టంపల్లి లొ ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

పిట్టంపల్లి లొ ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

పిట్టంపల్లి లొ ప్రజాయుద్ధనౌక  గద్దర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు
January 31, 2026 08:27 PM 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణ ప్రజా కవి, విప్లవ గాయకుడు గద్దర్ జయంతిని పురస్కరించుకుని చిట్యాల మండలం పిట్టంపల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.

నకిరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏనుగు రఘుమా రెడ్డి నేతృత్వంలో గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గద్దర్ ప్రజా ఉద్యమాలు, సామాజిక సేవలు స్మరించుకుంటూ ఆయన ఆశయాలు, భావజాలాన్ని కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

అనంతరం గద్దర్ కి ఘన నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొని గద్దర్ ఆశయాలను ప్రతిబింబించే నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో పిట్టంపల్లి గ్రామ సర్పంచ్ అందే అండాలు రాములు యాదవ్, బొంగోని చెరువు గ్రామ సర్పంచ్ కట్ట ఆశయ్య, వెలిమినేడు గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు సుర్కంటి సత్తిరెడ్డి, పిట్టంపల్లి ఉప సర్పంచ్ నారగోని నాగరాజు యాదవ్, వెలిమినేడు వార్డు సభ్యులు మంకాల లింగస్వామి, దేశబోయిన మంజుల మల్లేష్, మాజీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

అలాగే యువజన కాంగ్రెస్ నాయకులు ఏనుగు పద్మా రెడ్డి, వట్టిపల్లి యాదులు, ఎండీ ఖాజా పాషా, సుర్కంటి నర్సిరెడ్డి, అందే చందు యాదవ్, గోలి నరేష్, జక్కలి రాజు, మేడి విష్ణు, మేడబోయిన సురేష్, చిన్నం వెంకటేష్, అందే బన్నీ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News