Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు TGPSC UPSCలా మారాలి, రిటైర్మెంట్ 58కి, ₹5016 భృతి.. SC/ST బ్యాక్‌లాగ్‌తో 2L ఉద్యోగాలు: TNVP డిమాండ్లు లండన్‌లో అంబేద్కర్ మ్యూజియం భారత గొప్ప గుర్తింపు : రేలారే గంగా స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 26, 2026 11:25 PM

పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు

పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు

పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు
March 26, 2026 09:52 PM 74 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తేది: 25.03.2026: నారాయణఖేడ్ పరిధిలోని పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడిగి సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం, అతను డ్రైవర్‌గా మేడ్చల్ ప్రాంతంలో చాకలి రమేశ్‌తో కలిసి పనిచేస్తుండగా పని మానేస్తానని చెప్పిన విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం సుధాకర్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న రమేశ్ 25వ తేదీ సాయంత్రం సుమారు 7.15 గంటల సమయంలో సుధాకర్‌కు ఫోన్ చేసి దుర్భాషలాడి బెదిరించాడు. కొద్దిసేపటికే హస్నాబాద్ అంజి, చాకలి అంజి, బూతుపల్లి యాదగిరి, చాకలి రమేశ్ నలుగురు కలిసి రెండు బైకులపై సుధాకర్ ఇంటి వద్దకు చేరుకుని కులపేరుతో దూషిస్తూ గొడవకు దిగారు. ఈ సమయంలో సుధాకర్‌పై దాడి జరుగుతుండగా అడ్డుకోవడానికి వచ్చిన అతని అన్న మామిడిగి శ్రీనివాస్‌పై అంజి బ్లేడు‌తో గొంతు కోయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడికి చేరుకున్న గ్రామస్థులు వెంటనే గొడవను ఆపగా గాయపడిన శ్రీనివాస్‌ను జాహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిస్థితిని సమీక్షించేందుకు జాహీరాబాద్ డీఎస్పీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News