Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:58 AM

పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు

పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు

పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు
March 26, 2026 09:52 PM 205 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తేది: 25.03.2026: నారాయణఖేడ్ పరిధిలోని పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడిగి సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం, అతను డ్రైవర్‌గా మేడ్చల్ ప్రాంతంలో చాకలి రమేశ్‌తో కలిసి పనిచేస్తుండగా పని మానేస్తానని చెప్పిన విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం సుధాకర్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న రమేశ్ 25వ తేదీ సాయంత్రం సుమారు 7.15 గంటల సమయంలో సుధాకర్‌కు ఫోన్ చేసి దుర్భాషలాడి బెదిరించాడు. కొద్దిసేపటికే హస్నాబాద్ అంజి, చాకలి అంజి, బూతుపల్లి యాదగిరి, చాకలి రమేశ్ నలుగురు కలిసి రెండు బైకులపై సుధాకర్ ఇంటి వద్దకు చేరుకుని కులపేరుతో దూషిస్తూ గొడవకు దిగారు. ఈ సమయంలో సుధాకర్‌పై దాడి జరుగుతుండగా అడ్డుకోవడానికి వచ్చిన అతని అన్న మామిడిగి శ్రీనివాస్‌పై అంజి బ్లేడు‌తో గొంతు కోయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడికి చేరుకున్న గ్రామస్థులు వెంటనే గొడవను ఆపగా గాయపడిన శ్రీనివాస్‌ను జాహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిస్థితిని సమీక్షించేందుకు జాహీరాబాద్ డీఎస్పీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News