Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:56 PM

పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు

పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు

పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు
March 26, 2026 09:52 PM 201 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తేది: 25.03.2026: నారాయణఖేడ్ పరిధిలోని పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడిగి సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం, అతను డ్రైవర్‌గా మేడ్చల్ ప్రాంతంలో చాకలి రమేశ్‌తో కలిసి పనిచేస్తుండగా పని మానేస్తానని చెప్పిన విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం సుధాకర్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న రమేశ్ 25వ తేదీ సాయంత్రం సుమారు 7.15 గంటల సమయంలో సుధాకర్‌కు ఫోన్ చేసి దుర్భాషలాడి బెదిరించాడు. కొద్దిసేపటికే హస్నాబాద్ అంజి, చాకలి అంజి, బూతుపల్లి యాదగిరి, చాకలి రమేశ్ నలుగురు కలిసి రెండు బైకులపై సుధాకర్ ఇంటి వద్దకు చేరుకుని కులపేరుతో దూషిస్తూ గొడవకు దిగారు. ఈ సమయంలో సుధాకర్‌పై దాడి జరుగుతుండగా అడ్డుకోవడానికి వచ్చిన అతని అన్న మామిడిగి శ్రీనివాస్‌పై అంజి బ్లేడు‌తో గొంతు కోయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడికి చేరుకున్న గ్రామస్థులు వెంటనే గొడవను ఆపగా గాయపడిన శ్రీనివాస్‌ను జాహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిస్థితిని సమీక్షించేందుకు జాహీరాబాద్ డీఎస్పీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News