పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు
పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన – నలుగురిపై కేసు నమోదు
Krishna
తేది: 25.03.2026: నారాయణఖేడ్ పరిధిలోని పిప్పడపల్లి గ్రామంలో హత్యాయత్నం ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మామిడిగి సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం, అతను డ్రైవర్గా మేడ్చల్ ప్రాంతంలో చాకలి రమేశ్తో కలిసి పనిచేస్తుండగా పని మానేస్తానని చెప్పిన విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అనంతరం సుధాకర్ తన గ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న రమేశ్ 25వ తేదీ సాయంత్రం సుమారు 7.15 గంటల సమయంలో సుధాకర్కు ఫోన్ చేసి దుర్భాషలాడి బెదిరించాడు. కొద్దిసేపటికే హస్నాబాద్ అంజి, చాకలి అంజి, బూతుపల్లి యాదగిరి, చాకలి రమేశ్ నలుగురు కలిసి రెండు బైకులపై సుధాకర్ ఇంటి వద్దకు చేరుకుని కులపేరుతో దూషిస్తూ గొడవకు దిగారు. ఈ సమయంలో సుధాకర్పై దాడి జరుగుతుండగా అడ్డుకోవడానికి వచ్చిన అతని అన్న మామిడిగి శ్రీనివాస్పై అంజి బ్లేడుతో గొంతు కోయడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడికి చేరుకున్న గ్రామస్థులు వెంటనే గొడవను ఆపగా గాయపడిన శ్రీనివాస్ను జాహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరిస్థితిని సమీక్షించేందుకు జాహీరాబాద్ డీఎస్పీ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి