PRINT TIME: April 11, 2026 04:25 PM
పిల్లలమర్రిలో రెండు బ్రహ్మసూత్ర శివలింగాలకు మహా పర్వదిన పూజలు
పిల్లలమర్రిలో రెండు బ్రహ్మసూత్ర శివలింగాలకు మహా పర్వదిన పూజలు
February 09, 2026 03:11 PM
37 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
మహా పర్వదినాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మకమైన పిల్లలమర్రి గ్రామంలో వేంచేసి ఉన్న రెండు బ్రహ్మసూత్రాలు కలిగిన శివలింగాలకు సోమవారం తెల్లవారుజామున భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా శివలింగాలకు పంచామృతాలతో రుద్రాభిషేకం నిర్వహించి, అనంతరం నిరాజన, మంత్రపుష్పం సమర్పించారు. తదుపరి విశేష అలంకరణలో ఈశ్వరునికి దివ్య దర్శనం కల్పించారు.పర్వదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తుల నామస్మరణలు, ఓంకార నాదంతో మార్మోగాయి.
ఈ ప్రత్యేక పూజలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి