PRINT TIME: April 11, 2026 04:21 PM
పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్
పిల్లలమర్రి వాసి మొగిలి రవికి డాక్టరేట్
February 07, 2026 05:17 PM
157 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
జెఎన్టియు హైదరాబాద్లో స్నాతకోత్సవంలో ప్రదానం
పిల్లలమర్రి:
పిల్లలమర్రి గ్రామానికి చెందిన మొగిలి బిక్షం, యాదమ్మల కుమారుడు మొగిలి రవి డాక్టరేట్ పట్టా సాధించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ ఎం ఏకాంబరం నాయుడు, ప్రొఫెసర్ జి నర్సింహ పర్యవేక్షణలో ఆయన సమర్పించిన పరిశోధనా గ్రంథానికి ఈ గౌరవం లభించింది.చిత్ర సమాచార వర్గీకరణ కోసం మెరుగుపరచిన సాఫ్ట్ కంప్యూటింగ్ విధానాలు, ట్రాన్స్ఫార్మర్ ఆధారిత పద్ధతులు అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను జెఎన్టియు హైదరాబాద్లో నిర్వహించిన 14వ స్నాతకోత్సవంలో డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. మొగిలి రవి సాధించిన ఈ ఘనతతో పిల్లలమర్రి గ్రామంలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్రామస్తులు, బంధుమిత్రులు ఆయనను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి