పిల్లల రక్షణకు పోక్సో చట్టం – విద్యార్థుల్లో చైతన్యం
పిల్లల రక్షణకు పోక్సో చట్టం – విద్యార్థుల్లో చైతన్యం
Krishna
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్, ఆదేశాల మేరకు బుధవారం సంగారెడ్డి మండల పరిధిలోని ఫసల్వాది ఎం.ఎన్.ఆర్ ఉన్నత పాఠశాలలో భరోసా కోఆర్డినేటర్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పోక్సో చట్టంలోని ముఖ్య నిబంధనలు,పిల్లలపై జరిగే లైంగిక దాడుల కేసుల్లో విధించే కఠిన శిక్షలు వంటి అంశాలను వివరంగా తెలియజేశారు.అలాగే భరోసా కేంద్రం పోక్సో కేసుల్లో ఎలా సహాయం చేస్తుందో, బాధితులకు అందించే సేవలు ఏమిటో స్పష్టంగా అవగాహన కల్పించారు.విద్యార్థులు చిన్న వయస్సు నుంచే తమ లక్ష్యాలను నిర్ణయించుకొని, వాటిని సాధించేందుకు క్రమబద్ధమైన రోజువారీ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. యవ్వన దశలో ఎదురయ్యే ఆకర్షణలు, సోషల్ మీడియా వల్ల కలిగే దుష్ప్రభావాలు, విద్య ప్రాముఖ్యత వంటి కీలక అంశాలపై కూడా విద్యార్థులతో చర్చించి, వారికి సరైన దారినీ చూపించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మారియా నాతన్, ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి