పిల్లల ప్రతిభ వికాసమే లక్ష్యం : జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి
పిల్లల ప్రతిభ వికాసమే లక్ష్యం : జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి
Krishna
సంగారెడ్డి జిల్లా బాలసదనంలో పిల్లల కోసం వేసవి శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి లలిత కుమారి మాట్లాడుతూ వేసవి సెలవులను పిల్లలు సద్వినియోగం చేసుకొని తమలోని సృజనాత్మకతను వెలికి తీయాలని సూచించారు. చిత్రలేఖనం, రంగుల అలంకరణ, నృత్యం, గానం, లోపలి ఆటలు, బయటి ఆటల ద్వారా ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. చదువుతో పాటు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి చదవాలని సూచించారు. ఉన్నతాధికారులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని పిల్లలకు ప్రేరణనిచ్చారు.సిడబ్ల్యూసీ సభ్యుడు వెంకటేశం మాట్లాడుతూ... పిల్లలు చెడు ఆకర్షణలకు దూరంగా ఉండి విద్యపై దృష్టి పెట్టాలని, ఉన్నత లక్ష్యాలను చేరుకునే దిశగా కృషి చేయాలని తెలిపారు. డిసిపిఓ రత్నం మాట్లాడుతూ ఈ వేసవి శిబిరం ద్వారా పిల్లలకు తమ ప్రతిభను ప్రదర్శించే మంచి అవకాశం లభించిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో మొత్తం 45 మంది పిల్లలు పాల్గొంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాలసదనం పర్యవేక్షకురాలు విజయకుమారి, బాలల సహాయ కేంద్రం సమన్వయకర్త యాదగిరి, కళా ఉపాధ్యాయురాలు దీపతో పాటు సిబ్బంది నవనీత, ప్రశాంతి, నవీన్, నీరజ, నందిని తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి