Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేశంలో కుల వివక్ష లేని సమాజం నిర్మించాలి. ‘ఇండియా @ 80’ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి: బెజవాడ విల్సన్ డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 14, 2026 07:16 PM

పిల్లల ప్రతిభ వికాసమే లక్ష్యం : జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి

పిల్లల ప్రతిభ వికాసమే లక్ష్యం : జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి

పిల్లల ప్రతిభ వికాసమే లక్ష్యం : జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి
May 14, 2026 05:35 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా బాలసదనంలో పిల్లల కోసం వేసవి శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి లలిత కుమారి మాట్లాడుతూ వేసవి సెలవులను పిల్లలు సద్వినియోగం చేసుకొని తమలోని సృజనాత్మకతను వెలికి తీయాలని సూచించారు. చిత్రలేఖనం, రంగుల అలంకరణ, నృత్యం, గానం, లోపలి ఆటలు, బయటి ఆటల ద్వారా ప్రతిభను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. చదువుతో పాటు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి చదవాలని సూచించారు. ఉన్నతాధికారులను ఆదర్శంగా తీసుకొని వారి అడుగుజాడల్లో నడవాలని పిల్లలకు ప్రేరణనిచ్చారు.సిడబ్ల్యూసీ సభ్యుడు వెంకటేశం మాట్లాడుతూ... పిల్లలు చెడు ఆకర్షణలకు దూరంగా ఉండి విద్యపై దృష్టి పెట్టాలని, ఉన్నత లక్ష్యాలను చేరుకునే దిశగా కృషి చేయాలని తెలిపారు. డిసిపిఓ రత్నం మాట్లాడుతూ ఈ వేసవి శిబిరం ద్వారా పిల్లలకు తమ ప్రతిభను ప్రదర్శించే మంచి అవకాశం లభించిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరంలో మొత్తం 45 మంది పిల్లలు పాల్గొంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బాలసదనం పర్యవేక్షకురాలు విజయకుమారి, బాలల సహాయ కేంద్రం సమన్వయకర్త యాదగిరి, కళా ఉపాధ్యాయురాలు దీపతో పాటు సిబ్బంది నవనీత, ప్రశాంతి, నవీన్, నీరజ, నందిని తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News