Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:13 PM

పిల్లల విద్యాభివృద్ధికి మరో ముందడుగు – రాయిపల్లి పాఠశాలలో ప్రీ–ప్రైమరీ తరగతులు

పిల్లల విద్యాభివృద్ధికి మరో ముందడుగు – రాయిపల్లి పాఠశాలలో ప్రీ–ప్రైమరీ తరగతులు

పిల్లల విద్యాభివృద్ధికి మరో ముందడుగు – రాయిపల్లి పాఠశాలలో ప్రీ–ప్రైమరీ తరగతులు
February 18, 2026 06:44 PM 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలం పరిధిలో రాయిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి గాను ప్రీ–ప్రైమరీ తరగతులు (నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం చిన్నారుల విద్యాభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండల విద్యాధికారి రాజశేఖర్ షెట్కార్, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు శివకుమార్ స్వామి, రాయిపల్లి గ్రామ సర్పంచ్ సల్మా బేగం కమర్ హాజరై తరగతులను ప్రారంభించారు. చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించాలనే సంకల్పంతో ఈ తరగతులను ప్రారంభించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో రాయిపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయ బృందం, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారుల భవిష్యత్తు మెరుగుపడాలంటే పాఠశాల–తల్లిదండ్రుల సమన్వయం ఎంతో అవసరమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.గ్రామంలోనే ప్రీ–ప్రైమరీ విద్య అందుబాటులోకి రావడం వల్ల చిన్నారులు మెరుగైన పునాది విద్యను పొందే అవకాశం కలిగింది. గ్రామస్థులు ఈ కార్యక్రమాన్ని స్వాగతించి, పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ ప్రీ–ప్రైమరీ తరగతుల ప్రారంభం గ్రామ విద్యా రంగంలో ఒక శుభారంభంగా నిలవనుంది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News