Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామన్నపేట నియోజకవర్గ పునరుద్ధరణకు ఉద్యమం.జెట్టి శివ ప్రసాద్. సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 10:50 AM

పిడిఎస్యు సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక

పిడిఎస్యు సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక

పిడిఎస్యు సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక
January 21, 2026 06:43 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram

విద్య కాషాయికరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలి: కంపాటి పృథ్వీ

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

బుధవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) 23వ జిల్లా మహాసభలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ యానాల వీరారెడ్డి నగర్ లో నిర్వహించారు. ఈ మహాసభల్లో పిడిఎస్యు సూర్యాపేట జిల్లా నూతన కమిటీని ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా భీమనపల్లి ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా మాలోత్ చందర్ రావు తో పాటు మొత్తం తొమ్మిది మందితో కూడిన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాసభల్లో పాల్గొన్న పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కంపాటి పృథ్వీ మాట్లాడుతూ, విద్యారంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పిడిఎస్యు నిరంతరం పోరాటాలు చేస్తోందని అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారం కోసం సంఘం కృషి చేస్తోందని తెలిపారు. విద్య కాషాయికరణకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల మధ్య కొనసాగుతున్న సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తూ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పిడిఎస్యు పోరాటం కొనసాగిస్తోందని అన్నారు. గతంలో జరిగిన ఉద్యమాల నుంచి గుణపాఠాలు తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకునేందుకు ఈ మహాసభలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు జిల్లా నాయకులు ప్రకాష్, చందర్ రావు, ఉపాధ్యక్షులు శిరీష, సహాయ కార్యదర్శి నితిన్, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, టియుసిఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నర్సయ్య, అలాగే శ్రీనాథ్, దినేష్, కార్తీక్, ఉమేష్, సాయి, కుమార్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News