పిడిఎస్యు సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక
పిడిఎస్యు సూర్యాపేట జిల్లా నూతన కమిటీ ఎన్నిక
Vikram
విద్య కాషాయికరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలి: కంపాటి పృథ్వీ
సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :
బుధవారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్యు) 23వ జిల్లా మహాసభలు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ యానాల వీరారెడ్డి నగర్ లో నిర్వహించారు. ఈ మహాసభల్లో పిడిఎస్యు సూర్యాపేట జిల్లా నూతన కమిటీని ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా భీమనపల్లి ప్రకాష్, ప్రధాన కార్యదర్శిగా మాలోత్ చందర్ రావు తో పాటు మొత్తం తొమ్మిది మందితో కూడిన నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహాసభల్లో పాల్గొన్న పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు కంపాటి పృథ్వీ మాట్లాడుతూ, విద్యారంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై పిడిఎస్యు నిరంతరం పోరాటాలు చేస్తోందని అన్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల పరిష్కారం కోసం సంఘం కృషి చేస్తోందని తెలిపారు. విద్య కాషాయికరణకు వ్యతిరేకంగా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల మధ్య కొనసాగుతున్న సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తూ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం పిడిఎస్యు పోరాటం కొనసాగిస్తోందని అన్నారు. గతంలో జరిగిన ఉద్యమాల నుంచి గుణపాఠాలు తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకునేందుకు ఈ మహాసభలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర అఖిల్ కుమార్, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు జిల్లా నాయకులు ప్రకాష్, చందర్ రావు, ఉపాధ్యక్షులు శిరీష, సహాయ కార్యదర్శి నితిన్, సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, టియుసిఐ జిల్లా అధ్యక్షులు గొడ్డలి నర్సయ్య, అలాగే శ్రీనాథ్, దినేష్, కార్తీక్, ఉమేష్, సాయి, కుమార్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి